ఏపీలో ఓ అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేసింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు ముల్క్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ చైర్మన్ నవాబ్ షహతాజ్ షాజీ ఉల్ ముల్క్, వైస్ చైర్మన్ నవాబ్ అద్నాన్ ఉల్ ముల్క్. ఏపీలో ముల్క్ హోల్డింగ్స్ బిజినెస్ ప్లాన్పై సీఎం వైఎస్ జగన్తో వారు చర్చించారు.
వైఎస్సార్ జిల్లా కొప్పర్తి ఈఎంసీలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది ముల్క్ హోల్డింగ్స్. అల్యూమినియం కాయిల్స్ తయారీ, కాయిల్ కోటింగ్కు ఉపయోగించే హై పర్ఫామెన్స్ పెయింట్స్ తయారు చేయనుంది. అల్యూమినియం కాయిల్ కోటింగ్ ప్రొడక్షన్ లైన్స్, ఫిల్మ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మినరల్ కోర్స్ ప్రొడక్షన్ లైన్స్, అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్స్, మెటల్ కాంపోజిట్ మెటీరియల్స్ పొడక్షన్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది ముల్క్ హోల్డింగ్స్.
ఇటీవల దుబాయ్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పర్యటనలో ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది ముల్క్ హోల్డింగ్స్. రూ.1,500 కోట్ల పెట్టుబడితో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, రెండు వేలమందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. యూఏఈ హెడ్ క్వార్టర్గా ముల్క్ హోల్డింగ్స్, యూరప్, యూఎస్ఏ, ఆఫ్రికా, ఇండియా, మిడిల్ ఈస్ట్ దేశాలలో వ్యాపారాలు సాగిస్తోంది. 100కు పైగా దేశాలలో మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్. యూఏఈ, ఒమన్, సెర్బియా, ఇండియా, టర్కీలో ప్రొడక్షన్ బేస్. ఎం2 గ్లోబల్ ప్రొడక్షన్ కెపాసిటీ కలిగి వుంది.