Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంపై ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఇరాన్ క్షమాపణలు చెప్పిన తర్వాత ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన దేశం’’గా అభివర్ణించారు. ఇరాన్ ఈ రోజు చాలా తీవ్రంగా దెబ్బతింటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.
Iran Israel War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు(ఇరాన్) మాట్లాడాలనుకుంటున్నారు. నేను ఆలస్యమైందని చెప్పాను. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది’’ అని అన్నారు. ఆదివారం ఇరాన్ నాయకుల అభ్యర్థన మేరకు వారితో మాట్లాడటానికి అంగీకరించానని ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత, దీనికి విరుద్ధంగా తాజా ప్రకటన వచ్చింది.
Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో అయోధ్యలో జరిగిన ఒక కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తపస్వి ఛావని పీఠాధిపతి జగద్గురు పరమహంసాచార్య మంగళవారం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు వేద మంత్రోచ్ఛారణతో ఆశీర్వచనాలు అందించారు. ఆయన కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆయన ఫోటోకు తిలకం పెట్టి పూజలు నిర్వహించారు. నెతన్యాహూ ‘‘మహాపురుషుడు’’ అంటూ కొనియాడారు.
BV Raghavulu: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెటైర్లు వేశారు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైఖరి దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. చర్చలు జరుపుతున్నామని చెబుతూ అకస్మాత్తుగా దాడులు చేయడం అనైతికమని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపే పరిస్థితి లేదని, మారణకాండ కొనసాగుతుందని…
Pakistan: ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణం పాకిస్తాన్ చావుకొచ్చినట్లు ఉంది. పాకిస్తాన్ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. యూఎస్, ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. పాక్ ఆర్థిక రాజధాని కరాచీతో పాటు రాజధాని ఇస్లామాబాద్, లాహోర్తో సహా అన్ని ప్రధాన పట్టణాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కరాచీలో ఏకంగా యూఎస్ ఎంబసీపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఎంబసీ కాంపౌండ్లోకి ప్రవేశించడానికి చూసిన మూకపై యూఎస్ సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 10 మందికి పైగా మరణించారు.…
Ayatollah Ali Khamenei: మధ్యప్రాచ్య రాజకీయాలను నాలుగు దశాబ్దాల పాటు శాసించిన ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ (86) శకం ముగిసింది. శనివారం అర్ధరాత్రి అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ దాడిలో ఖమేనీ మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. 1989 నుంచి ఇరాన్ను తన గుప్పిట్లో ఉంచుకున్న ఖమేనీ మరణంతో ఆ దేశంలో ఒక యుగం అంతమైంది. READ ALSO: Minab Airstrike: ఇరానియన్ బాలికల పాఠశాలపై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక…
Ali Khamenei: ఇజ్రాయెల్ – అమెరికా సంయుక్తంగా జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వాదనను బలపరుస్తూ, సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. తన పోస్ట్లో ట్రంప్.. ఖమేనీని చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తులలో ఒకరిగా అభివర్ణించారు. ఆయన మరణం ఇరాన్ ప్రజలకే కాకుండా, ఆయన హయాంలో ప్రాణాలు…
Iran Isreal War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందని.. గతంలో కంటే బలమైన దేశంగా ఆవిర్భవించిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ట్రంప్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేశారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో రిసార్ట్ లోకి అనధికారికంగా ప్రవేశించిన చొరబాటుదారుడిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. మార్ ఎ లాగో ఎస్టేట్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించిన ఒక సాయుధ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు హతమార్చారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ట్రంప్ అక్కడ లేరు.