భారీ వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా రెండు మార్గాల్లో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా శనివారం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గత రాత్రి నుంచి బల్తాల్, పహల్గాం మార్గాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయని వారు వెల్లడించారు.
Amarnath Yatra: జమ్ము కశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. అయితే, తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక న్యూస్ వినిపిస్తుంది. అమర్నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి వల్ల మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది.
తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ అధికారులు అలర్ట్ చేశారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది అని తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయని చెప్పారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. మరోవైపు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే నిన్న (సోమవారం) అర్ధరాత్రి వరకు 71,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,462 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండి ఆదాయం 4.01 కోట్లు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
గంగా దసరా సందర్భంగా రికార్డు స్థాయిలో భక్తులు హరిద్వార్కు చేరుకున్నారు. దీంతో మంగళూరులోని నర్సన్ సరిహద్దు నుంచి హరిద్వార్ వెళ్లే హైవేపై భారీ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ వ్యవస్థను సులభతరం చేసేందుకు రూర్కీలోని నాగ్లా ఇమర్తి నుంచి వాహనాలను లక్సర్ వైపు మళ్లించి హరిద్వార్కు పంపుతున్నారు. ఇన్నీ సహాయక చర్యలు చేపట్టినా.. హరిద్వార్లో రద్దీ తగ్గడం లేదు.
ఒడిశాలోని ప్రముఖ దేవాలయం పూరీ జగన్నాథ దేవాలయం నాలుగు ద్వారాలు తెరుచుకున్నాయి. గురువారం ఉదయం వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రివర్గం మొత్తం హాజరయ్యారు. భవిష్యత్తులో పూరీ జగన్నాథుడిని నాలుగు ద్వారాల ద్వారా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మండలి నిర్ణయం అమలులోకి వచ్చిందన్నారు. Pawan Kalyan’s Russian Wife Anna Lezhneva: పవన్ కల్యాణ్ కి మూడో భార్యతో పరిచయం…
తిరుమలలో వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి భక్తులు 22 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక శనివారం నాడు శ్రీవారిని 79398 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 43567 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక శ్రీవారి హుండి ఆదాయం 2.9 కోట్లుగా వచ్చింది. ఇకపోతే జూన్ 18వ తేది నుంచి ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెలకు సంభందించిన దర్శన టికేట్లు విడుదల చేయనుంది టిటిడి. IND…
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరగింది. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వెళ్లిన వారికి దర్శనం చేసుకునేందుకు టైం పడుతుందని టీటీడీ తెలిపింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది.
తిరుమలలో భక్తల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయి.. నాలుగు రోజుల పాటు భక్తులు రోడ్లపై రెండు కిలో మీటర్ల మేర నిలబడ్డారు.