Tirumala Darshanam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
- భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు..
- టోకేన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Darshanam: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతుంది. వడ్డీకాసులవాడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లలని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచి ఉన్నారు. ఇక, టోకేన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది. అలాగే, నిన్న శ్రీవారిని 65, 392 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇప్పటి వరకు 29, 015 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, హుండి ఆదాయం 4. 23 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Read Also: MLA Prakash Goud: బీఆర్ఎస్కు మరో భారీ షాక్.. నేడు కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే..
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
ఇక, ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. సాయంత్రం పుష్పపల్లకిలో మలయప్పస్వామి దర్శనం ఉండటంతో ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 15వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అలాగే, తిరుపతి కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 18వ తేదీ నుంచి 20 వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగబోతున్నాయి. ఇందు కోసం జూలై 17వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తామని అర్చకులు వెల్లడించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు అప్పుడప్పుడు జరుగుతాయి.. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు జరుపుతారు.
Read Also: Nepal : పెను ప్రమాదం…కొండచరియలు విరిగి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..60మంది గల్లంతు
అలాగే, ఇందులో భాగంగా జూలై 18న మొదటి రోజు ఉదయం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ జరపగా, 19న గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేస్తామని అర్చకులు పేర్కొన్నారు. 20వ తేదీన ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ, సాయంత్రం కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, విఘ్నేశ్వరస్వామి, సుబ్రమణ్యస్వామి, చండికేశ్వర స్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.
తాజావార్తలు
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!