Gunfire Due To Pizza: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పిజ్జా తినడంపై కుటుంబంలో తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ మొత్తం వ్యవహారం సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య పిజ్జా పంపిణీపై వాగ్వాదం తర్వాత, ఒక మహిళను ఆమె తోడికోడలు సోదరుడు కాల్చాడు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Read Also: Manipur…
గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల బదిలీలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీలు ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
భారత స్టార్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆటకు కొంత సమయం విరామం ప్రకటించింది. ఈ సమయంలో ఆయా ఈవెంట్స్ల్లో పాల్గొంటోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్లో పాల్గొని ర్యాంప్పై వయ్యారాలు ఒలకబోసింది.
పరిశ్రమల స్థాపనకు భారత్లో మరే రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లో అనువైన వాతావరణాన్ని కల్పించి, ప్రోత్సహకాలు అందజేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్లో జరిగిన యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం లీడర్ షిప్ సమ్మిట్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఫోరమ్ చైర్మన్, జేసీ2 వెంచర్స్ వ్యవస్థాపకుడు జాన్ ఛాంబర్స్ అధ్యక్షత వహించారు. ఫైర్ సైడ్ సంభాషణలో ఆపిల్ ఇండియా మేనేజింగ్…
ప్రధాని మోడీని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కలిశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ప్రధాని మోడీని కలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. అతిషి భేటీని ప్రధాని మంత్రి కార్యాలయం ఎక్స్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు.
Air Pollution: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే గాలి నాణ్యత బాగా క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈరోజు (సోమవారం) ఉదయం 9 గంటల వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 221గా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పేర్కొనింది.
Bomb Threat: ఈరోజు (సోమవారం) ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీకి మళ్లించారు. విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
మను భాకర్ పరిచయం అక్కర్లేని పేరు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత భారతీయులకు మను భాకర్ సుపరిచితురాలే. స్టార్ షూటర్గా ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించింది. దీంతో ఆమె పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? మను భాకర్ షూటర్గానే కాకుండా ఫ్యాషన్ షోలో కూడా తన వయ్యారాలతో అలరించింది. క్యూట్ వాక్తో చూపరులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఢిల్లీలోని రమేష్ నగర్లో పోలీసులు పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. గురువారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 200 కిలోల కొకైన్ను పట్టుబడింది. దీని విలువ రూ. 2 వేల కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.