ఓ దశలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టించింది.. ఎప్పుడూలేని విధంగా సెకండ్ వేవ్లో రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి.. దీంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాక్డౌన్ ప్రకటించారు.. దీంతో.. కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పుడుతున్నాయి.. దాదాపు నెల పదిహేను రోజుల తర్వాత ఇవాళ అత్యల్పంగా 2,260 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఏప్రిల్ 22న ఏకంగా 36 శాతంగా నమోదైన కరోనా పాజిటివిటీ రేటు..…
కరోనా సెకండ్ వేవ్ సామాన్యుల ప్రాణాలే కాదు.. పెద్ద సంఖ్యలో వైద్యుల ప్రాణాలు కూడా తీస్తోంది… కనిపించని వైరస్తో ముందుండి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు పెద్దల సంఖ్యలో దాని బారినపడుతూనే ఉన్నారు.. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయిన తర్వాత దేశవ్యాప్తంగా 420 మంది వైద్యులు మరణించారని ప్రకటించింది ఇండియన్ మెడికల్ అసోసియేష (ఐఎంఏ).. అందులో కేవలం ఢిల్లీలోనే 100 మంది వైద్యులు మృతిచెందారని.. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లోనే వైద్యులు…
సింగపూర్ స్ట్రెయిన్తో భారత్లో థర్డ్ వేవ్ ప్రభావం ఉందని.. ఇది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. వెంటనే ఆ దేశం నుంచి విమానాల రాకపోలకు నిలిపివేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు.. మరోసారి కేంద్రం వర్సెస్ ఢిల్లీ సర్కార్గా మారిపోయాయి.. సింగపూర్ వేరియంట్ పై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టింది కేంద్రం.. ఆయన వ్యాఖ్యలపై సింగపూర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. స్పందించిన భారత ప్రభుత్వం.. అరవింద్ కేజ్రీవాల్..…
భారత్ను కరోనా సెకండ్ వేవ్ అల్ల కల్లోలం చేస్తోంది.. దాని దెబ్బకు చాలా రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి.. మరికొన్ని రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. అయితే, థర్డ్ వేవ్ ముప్పు కూడా లేకపోలేదని.. అది చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.. సింగపూర్ లో చిన్నారుల్లో వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన……
భారత దేశంలో పురాతన కాలం నుంచి కొన్ని రకాల ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తుంటారు. చనిపోయిన పెద్దవాళ్లకు శ్రార్ధ కర్మలు నిర్వహిస్తుంటారు. ఈ శ్రార్ధ కర్మల్లో పిండ ప్రధానం ప్రధానమైనది. పిండప్రదానం చేయడానికి కాకులు అవసరం అవుతాయి. కానీ, పెరిగిపోతున్న నగరీకరణ, రేడియేషన్ కారణంగా కాకులు అంతరించిపోతున్నాయి. దీంతో పెద్ద పెద్ద నగరాల్లో కాకులు మచ్చుకైనా కనిపించడం లేదు. అయితే, ఢిల్లీకి చెందిన ఓ పెద్దాయన దీనిని ఉపాధిగా మార్చుకున్నాడు. రెండు కాకులను పెంచి పెద్ద చేశాడు. …
భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం సెంటర్ విస్టా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సెంటర్ విస్టా ప్రాజెక్టులో కొత్త పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ఉప రాష్ట్రపతి, ప్రధాని కొత్త నివాసాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 2026 వరకు పూర్తి కానున్నది. కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది. 75 వ స్వాతంత్ర తరువాత జరిగే…
నన్ను కూడా అరెస్ట్ చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా కేంద్రానికి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. కరోనా నివారణ చర్యల్లో మోడీ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో పలువురిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడంపై ట్విట్టర్లో స్పందించిన రాహుల్.. ఆ పోస్టర్ల కాపీలను షేర్ చేస్తూ. నన్ను కూడా అరెస్టు చేయండి అంటూ కామెంట్ పెట్టారు.. ఇక, మోడీ గారూ మీరు మా పిల్లల టీకాలు విదేశాలకు ఎందుకు పంపించారు?…
కరోనాకు చెక్ పెట్టేందుకు ఏకైక మార్గం వ్యాక్సినేషనే అంటున్నారు వైద్య నిపుణులు.. అయితే, ఈ నెల 1వ తేదీ నుంచి భారత్లో వ్యాక్సినేషన్ ఊపందుకుంటుందని భావించినా.. డోసుల కొరతతో.. గతంలో కంటే వ్యాక్సినేషన్ స్పీడ్ తగ్గుతూ వస్తోంది. ఈ వ్యవహారంలో కేంద్రంలోని మోడీ సర్కార్ను టార్గెట్ చేశారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం.. రోజు రోజుకూ వ్యాక్సిన్లు ఇచ్చే సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ.. సర్కార్ వ్యాక్సిన్ వ్యూహాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్…
ఈనెల 8 వ తేదీన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయ్యింది. ఓ యువతి చేతికి సిలైన్, ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని అత్యవసర బెడ్ మీద చికిత్స పొందుతూ కనిపించింది. ఐసీయూలో చేరాల్సి ఉన్నా బెడ్ దొరక్కపోవడంతో అత్యవసర వార్డులో ఆమెకు చికిత్స అందించారు వైద్యులు. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ఉన్న రోజులు డీలాపడిపోయి మానసికంగా కృంగిపోయి ఉంటారు. కానీ, ఆ యువతి మాత్రం అలా కాదు. ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా మానసికంగా ధైర్యంగా ఉన్నది. …