బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా నివాసంలో ఈ రోజు కీలక సమావేశం జరుగనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జె.పి. నడ్డాతో ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలను నడ్డాకు వివరించనున్నారు ఈటల రాజేందర్. ఇప్పటికే బిజేపిలో చేరేందుకు రంగం సిద్దం కాగా.. బిజేపిలో తాను నిర్వహించాల్సిన పాత్రపై చర్చిం చనున్నారు. తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్ర బిజేపిలో తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించే అంశంపై…
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.. ఇది చాలా ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. సెంట్రల్ విస్టా పనులను ఆపాలంటూ దాఖలైన పిల్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇది ఉద్దేశపూర్వకంగా వేసిన పిటిషన్ తప్ప పిల్ కాదని పేర్కొంది.. అంతేకాదు పిటిషనర్లకు రూ.లక్షల జరిమానా కూడా విధించింది. సంబంధిత…
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని కొన్ని రేజులు పెట్రో ధరల పరుగుకు కళ్లెం పడింది.. కానీ, ఎన్నికల ముగిసి.. ఫలితాలు వెలువడిన తర్వాత మళ్లీ వరుసగా పెరుగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి.. డీజిల్ ధర రూ.95 వరకు చేరింది.. తాజాగా లీటర్ పెట్రోల్పై 29 పైసలు, లీటర్ డీజిల్పై 24 పైసల చొప్పున వడ్డించాయి చమురు సంస్థలు.. దీంతో ఢిల్లీలో పెట్రోల్,…
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం, మృతుల సంఖ్య కూడా భారీగా ఉండడంతో.. అప్రమత్తమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. లాక్డౌన్ ప్రకటించారు.. కేసులు అదుపులోకి రాకపోవడంతో క్రమంగా లాక్డౌన్ను పొడిగిస్తూ వచ్చారు. అక్కడ లాక్డౌన్ మంచి ఫలితాలను ఇచ్చింది.. ఇప్పుడు కరోనా పాజిటివిటీ రేటు 1.5 శాతానికి పడిపోయింది.. దీంతో.. ఈ నెల 31వ తేదీ నుంచి దశలవారీగా అన్లాక్కు వెళ్లనున్నట్టు వెల్లడించారు…
ఢిల్లీలో ఓ యూట్యూబర్ అత్యుత్సాహంతో చేసిన పనికి కటకటాలపాలయ్యాడు. ఢిల్లీకి చెందిన యూట్యూబర్ గౌరవ్ శర్మ ఇటీవల తన పెంపుడు కుక్కను.. హైడ్రోజన్ బెలూన్లకు కట్టి వీడియోను తయారు చేశాడు. వాటితో కలిపి కుక్కను ఎగరవేసాడు. అది కాస్తా వైరల్గా మారడంతో చూసినవాళ్లంతా ఆ యూట్యూబర్పై విమర్శలు చేశారు. అంతేకాదు, జంతు ప్రేమికులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆ యూట్యూబర్ పై పోలీస్ కేసు నమోదు అయింది. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఓ వైపు…
మంగళవారం రోజు .. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ను నియమించిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగున్నారు జైస్వాల్.. మహారాష్ట్ర క్యాడర్ 1985 బ్యాచ్కు చెందిన ఈ ఐపీఎస్ ఆఫీసర్.. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించినా.. చివరకు ప్యానల్ సుబోధ్ కుమార్ జైస్వాల్ వైపు…
సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకోసం కొత్త నిబందనలను కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నిబందనలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి. కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త ఐటి నిబందనలు యూజర్ల గోప్యతకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే కేంద్రం తీసుకొచ్చిన నిబందలను అడ్డుకోవాలని కోరుతూ వాట్సాప్ డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దేశ భద్రతకు లేదా ప్రజలకు హాని కలిగించే విధంగా ఏవైనా పోస్టులను పెడితే ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేలా కొత్త నిబందనలు…
కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామ్య పద్ధతిలో ఆమోదించుకున్న “మూడు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు” రద్దు చేయాలని, కనీస మద్దతు ధర(ఎంఎస్పి)కు చట్టబద్ధత కల్పించాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం ప్రారంభమై నేటికి ఆరు నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల పట్ల మోడీ ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ, “సంయుక్త కిసాన్ మోర్చా” మే 26 వ తేదీన “బ్లాక్ డే” నిర్వహించాలని పిలుపునిచ్చారు.…
కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత ఆరు నెలలుగా దేశంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. కానీ, కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకోలేదు. ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కరోనా మహమ్మారి తీవ్రతరం కావడంతో రైతులు ఢిల్లీని వదిలి వెనక్కి వెళ్లారు. అయితే, ఈ నెల 26 వ తేదీన బ్లాక్ డే నిర్వహించాలని భారత్ కిసాన్ యూనియన్, కిసాన్ సంయుక్త మోర్చా నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హర్యానా, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకునేందుకు బయలుదేరి వెళ్లారు.…
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో కొంతమేర కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివిటి రేటు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు లాక్ డౌన్ ను సడలిస్తే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు లాక్ డౌన్ అమలులో…