కర్నాటక రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. వయసు నియమావళి ప్రకారం బీజేపీ యడ్యూరప్పను తప్పించిందని బీజేపీ చెబుతున్నది. అధిష్టానం తనపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేదని, బీజేపీ నియమావళికి కట్టుబడి రాజీనామా చేసినట్టు అటు యడ్యూరప్ప కూడా పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఈ అంశాన్ని మరోలా చూస్తున్నాయి. ముఖ్యమంత్రిని బలవంతంగా తప్పించారని సెటైర్లు వేస్తున్నాయి. అవినీతి కారణంగానే ముఖ్యమంత్రిని తొలగించి చేతులు కడుక్కోవాలని కేంద్రం చూస్తున్నట్టు కాంగ్రెస్…
పార్లమెంట్లో రైతు చట్టాలపై వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి. రైతు చట్టాలను బ్యాన్ చేయాలని ఇప్పటికే రైతులు ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించారు. పార్లమెంట్ ముట్టడిని మొదట ప్రకటించినప్పటికీ, ఆ తరువాత ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది.…
ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న యువతి కొంత కాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతోంది. ఈ కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఢిల్లీలోని ఫరీదాబాద్ మెట్రో రైల్ స్టేషన్ పైకి ఎక్కింది ఆ యువతి. సమాచారం అందుకున్న ఎస్సై ధన్ ప్రకాశ్, కానిస్టేబుల్ సర్ఫ్రాజ్ అక్కడకు వెళ్లారు. మెట్రో సిబ్బందితో కలిసి ఆ యువతికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కాగా స్టేషన్ కింద ఉన్న ఎస్సై ఆమెను మాటల్లోకి దించి దృష్టి మరల్చాడు. ఇంతలోకి పైకి ఎక్కి ఆమె…
ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద రైతులు ధర్నా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే “సంయుక్త కిసాన్ మోర్చా”, “కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ” కు చెందిన 200 మంది గుర్తింపు కార్డులు కలిగిన రైతులకు మాత్రమే ధర్నా చేయటానికి అనుమతి ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ వద్ద రైతుల ధర్నాకు అనుమతి ఇచ్చారు. జూలై 22 నుండి ఆగష్టు 9…
కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోక ముందే దేశంలో మరో వైరస్ ఇబ్బందు తెచ్చిపెడుతున్నది. పక్షులకు సోకే బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకుతున్నది. బర్డ్ఫ్లూ వైరస్తో 11 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు దృవీకరించారు. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు ఐసోలేషన్కు వెళ్లాలని, ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలని నిపుణులు సూచించారు. ఈనెల 2 వ తేదీన హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యూమోనియా,…
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే.. భారీ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి… ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని.. తమకు సమాచారం చేరినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.. డ్రోన్లతో దాడికి ఉగ్రవాదుల కుట్రపన్నారని వెల్లడించిన ఇంటెలీజెన్స్ బ్యూరో… దేశ రాజధానిలో ‘ఆపరేషన్ జెహాద్’ ను ప్రారంభించడానికి ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. ఆగస్టు 15కు ముందే దాడులకు ప్రణాళికలు వేసినట్టు చెబుతున్నారు.. ఈ ఉగ్రదాడిని అడ్డుకోవడానికి అలర్ట్గా…
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది… ప్రతిపక్ష నేతలు, సీనియర్ జర్నలిస్టులు, ప్రముఖులతో పాటు.. కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్కు గురికాడంతో ప్రభుత్వంపై విమర్శలు పెరిగాయి.. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఫోన్లు ట్యాప్ చేస్తూ.. అభద్రతకు గురిచేస్తున్నారన్న ఆయన.. పెగాసస్ స్పైవేర్ ను ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతారని.. రాహుల్ గాంధీ, ఆయన కార్యాలయంలోని సిబ్బంది ఫోన్లు కూడా…
ఇవాళ్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈరోజు నుంచి ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 20 రోజులపాటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీల సభ్యులు పార్లమెంటు ఉభయసభలలో చాలా కఠినమైన, పదునైన ప్రశ్నలను అడగాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుందని చెప్పిన మోడీ… ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే…
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో… అన్ని పార్టీలు వ్యూహరచనలో మునిగిపోయాయి.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారని.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ.. పాత, కొత్త కేంద్ర మంత్రులకు సూచనలు చేయగా.. మరోవైపు ప్రతిపక్షాలు కూడా సమస్యలను లేవనెత్తేందుకు సిద్ధం అవుతున్నాయి.. అందులో భాగంగా.. రేపు సాయంత్రం 6 గంటలకు సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై…
సీనియర్ పొలిటిషన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. సుమారు 50 నిమిషాల పాటు ఇద్దరి మధ్య చర్చలు జరగడంతో.. ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాల కాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సమావేశాలు సజావుగా సాగడానికి అధికారపక్షం ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది.. దానిలో భాగంగానే మోడీ-పవార్ భేటీ జరిగినట్టు చెబుతున్నారు.. ఇక, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్ కూడా…