ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్… నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశమైన ఆయన… కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. KRMB, GRMBల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని… అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆరు రోజులుగా ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్… వరుసగా కేంద్రమంత్రుల్ని కలుస్తున్నారు.
నిన్న గజేంద్రసింగ్ షెకావత్తోనూ, నితిన్ గడ్కరీతోనూ ఆయన సమావేశమయ్యారు. జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో… జల వివాదాలతో పాటు అనేక అంశాలపై చర్చించారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్పై… తమ అభ్యంతరాలను షెకావత్ దృష్టికి తీసుకెళ్లారు. KRMB, GRMBల నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు సమయం కావాలని… అప్పటి వరకు రెండు బోర్డులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
కొత్త కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఉపసంహరణ దరఖాస్తు కూడా దాఖలు చేశామని చెప్పారు. అలాగే కృష్ణా జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా కావాలని షెకావత్ను కోరారు… కేసీఆర్. కృష్ణా నదిపై అనుమతిలేకుండా ఏపీ ప్రాజెక్టులు నిర్మిస్తోందని… ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల పరిస్థితిని… షెకావత్కు వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారట. ఇక ఇవాళ మరికొంత మంది మంత్రులను కలిసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.