RCB vs DC: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 175 పరుగుల లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Royal Challengers Bangalore Scored 174 Runs Against Delhi Capitals: ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (34 బంతుల్లో 50) ఒక్కడే అర్థశతకంతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడలేదు. అంతంత మాత్రంగానే రాణించారు. డు ప్లెసిస్ (22), లామ్రోర్ (26), మ్యాక్స్వెల్ (24) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. చివర్లో షాబాజ్ (12 బంతుల్లో 20) తనకు వీలైనంత వరకు నెట్టుకొచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ అనూజ్ రావత్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. 22 బంతుల్లో ఒక ఫోర్ సహకారంతో కేవలం 15 పరుగులే చేశాడు. హోమ్ గ్రౌండ్లో ప్రతీసారి విరుచుకుపడే ఆర్సీబీ జట్టు.. ఈసారి మాత్రం సోసోగానే రాణించింది.
Also Read
- Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
- MS Dhoni: 'తలా ఫర్ ఏ రీజన్.!' CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
- Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
- RCB Physiotherapist: ఆర్సీబీ ఫిజియోథెరపిస్ట్ స్టోరీ అంతా డూపే.. హేజిల్వుడ్, లివింగ్స్టోన్ ఏం చేయలేదు!
ఓపెనర్లుగా మైదానంలో అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ, డు ప్లెసిస్.. మొదట శుభారంభమే అందించారు. 4.4 ఓవర్లలోనే వీళ్లిద్దరు తొలి వికెట్కి 42 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఎప్పట్లాగే వీళ్లిద్దరు చెలరేగి ఆడటంతో.. ఈసారి కూడా ఆర్సీబీ భారీ స్కోరు చేస్తుందని అనుకున్నారు. కానీ.. డు ప్లెసిస్ ఔటయ్యాక ఆ అంచనాలు బోల్తా పడ్డాయి. క్రీజులో ఉన్నంతవరకు కోహ్లీ తన జట్టుని ముందుకు నడిపించాడు. కానీ.. అతడు ఔటయ్యాక ఆర్సీబీ జోరు తగ్గింది. మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా మెరుపులు మెరిపించలేకపోయారు. ఏదో.. తమవంతు సహకారం అందించారే తప్ప, మెరుగైన ఇన్నింగ్స్ ఆడలేదు. ఇక చివర్లో అనూజ్ బంతులు వృధా చేయడంతో, ఆశించిన స్కోరు రాలేదు. 174 పరుగులకే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఢిల్లీ బౌలర్లలో.. నోర్ట్యే ఒక్క వికెట్ కూడా తీయకపోయినా, కట్టుదిట్టమైన బౌలింగ్ వేశాడు. మిచెల్, కుల్దీప్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. అక్షర్, లలిత్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు. మరి.. ఆర్సీబీ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఛేధిస్తుందా? లేదా? వేచి చూడాలి.
Renuka Chowdhury: బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తే.. అక్రమ కేసులు బనాయించడం దారుణం
తాజావార్తలు
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
-
Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
-
Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!