IPL 2023: గెలిస్తే క్రెడిట్ తీసుకుని.. ఓడితే వాళ్లను నిందించడానికి ఇదేమైన టీమిండియానా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో మ్యాచ్ లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్ లు చివరి బంతి వరకు వెళ్లి గెలుస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్ లో ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఇప్పటి వరకు గెలుపు చూడని ఢిల్లి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
Also Read : Jagadish Shettar : బీజేపీకి బిగ్ షాక్.. ఎన్నికలకు ముందు పార్టీకి మాజీ సీఎం రాజీనామా
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. జట్టు డైరెక్టర్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ప్రధాన కోచ్ గా రికీ పాటింగ్ ఉన్నా.. ఢిల్లీ తలరాత మాత్రం మారడం లేదు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ జట్టు ఓటమి బాధ్యతలను రికీ పాటింగ్, సౌరభ్ గంగూలీ తీసుకోవాలన్నారు.. వరుస ఓటములకు వారిదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. గత సీజన్ లో ఢిల్లీ ఫైనల్స్ కు చేరినప్పుడు.. క్రెడిట్ జట్టు కోచ్ రికీ పాంటింగ్ కు దక్కింది.. అలా గెలుపు క్రెడిట్ అతని ఖాతాలో పడినప్పుడు ఓటమి బాధ్యతలను కూడా తీసుకోవాలని సెహ్వాగ్ కామెంట్ చేశారు.
Also Read : Adimulapu Suresh: సీఎం జగనే వైఎస్ వివేకా కేసును సీబీఐకి ఇవ్వమని చెప్పారు..
జట్టు ఓడినా, గెలిచినా కోచ్ లదే ప్రధాన పాత్ర ఉంటుందని.. ప్రస్తుతం ఢిల్లీ వరుస ఓటములకు బాధ్యతను సైతం రికీ పాటింగ్ దేనని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు. ఇదేమీ భారత క్రికెట్ జట్టు కాదు.. అక్కడ ఎవరైనా గెలిస్తే తమ గొప్పగా భావిస్తారు.. ఓడిత మాత్రం ఇతరులను నిందిస్తారన్న సెహ్వాగ్.. ఐపీఎల్ లో కోచ్ పాత్ర కేవలం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం మాత్రమే కాదు అన్నారు. అయితే ఈ సారి మాత్రం ఢిల్లీ టీం గొప్పగా రాణించలేదని.. రాబోయే మ్యాచ్ లోనైనా తిరిగి పుంజుకోవాలని సెహ్వాగ్ వెల్లడించారు.

తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!