Triangle Love: ‘‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’’ చివరకు విషాదంగా మారింది. అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడటం హత్యకు దారి తీసింది. ఈ ఘటన బెంగళూర్ లోని సంజయ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 24 ఏళ్ల వరుణ్ కోటియన్ అనే యువకుడి హత్య జరిగింది. ఉడిపికి చెందిన వరుణ్ని అతడి స్నేహితుడు దివేష్(25) బెంగళూర్లోని గెద్దలహళ్లీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో హత్య చేశాడు.
UP News: అసలు ఇలాంటి నీచుడిని ఎక్కడా చూడం.. వీడు చేసిన అఘయిత్యాన్ని చూస్తే వీడు ఓ కొడుకేనా..? అని అనిపించక మానదు. భర్త చనిపోయి బాధలో ఉన్న కన్నతల్లి పైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ కేసులో నిందితుడికి ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం నిందితుడిని కోర్టు నుంచి చేతులకు బేడీలు వేసి బయటకు తీసుకు వస్తున్న వీడియో వైరల్గా మారింది.
UP Crime: అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ నిందితులకు భయం అనేదే లేకుండా పోయింది. ఇదిలా ఉంటే, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.
Bengaluru chilling murder: శ్రద్ధావాకర్ తరహాలోనే బెంగళూర్లో మహాలక్ష్మీ అనే 29 ఏళ్ల యువతి దారుణ హత్య జరిగింది. ఈ హత్య స్థానికంగా సంచలనంగా మారింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్లో పెట్టిన వైనం ఒళ్లు గగుర్పాటు గురయ్యేలా ఉంది. తాజాగా ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ బి దయానంద్ సోమవారం తెలిపారు.
గుంటూరు జిల్లాలో రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గుంజి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి మోసం చేశాడని భాదితులు ఫిర్యాదు చేశారు. పదిమంది వద్ద సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడని చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చాయి.
UP Shocker: యూపీలో గత వారం హత్యకు గురైన 17 ఏళ్ల బాలిక మిస్టరీ వీడింది. అత్యాచారానికి గురైన బాలిక వల్ల కుటుంబ పరువు పోతుందని సొంత తల్లి, ఇద్దరు కుమారులు ఆమెను దారుణంగా చంపేశారు. విచారణ తర్వాత సొంత కుటుంబమే బాలికను హత్య చేసినట్లు తేలిందని పోలీసులు ఆదివారం తెలిపారు. అత్యాచారం కేసు కారణంగా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే ముగ్గురు కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Bengaluru Woman Murder: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్లో మహాలక్ష్మి దాస్ (28) అనే మహిళని దారుణహత్య సంచలనంగా మారింది. ఈ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని వైయాలికావల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆమె శరీరాన్ని 32 ముక్కలుగా నరికి, ఆమె ఇంట్లోని ఫ్రిజ్ లోనే పెట్టారు. ఫ్రిజ్ కింది షెల్ఫ్లో ఆమె తెగిపడిన తల, పైన కాళ్లు, మధ్య భాగంలో మిగిలిన శరీర భాగాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
UP Crime: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు
Bengaluru:బెంగళూర్లో దారుణం జరిగింది. 29 ఏళ్ల మహిళను కిరాతకంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 32 ముక్కలు చేసి, ఆమె నివాసంలోని ఫ్రిజ్లో దాచిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రస్తుతానికి ఎవరు చంపారు..? ఎందుకు చంపారు..? అనుమానితులు ఎవరు..? అనే వివరాలు తెలియరాలేదు.
Vizag: విశాఖపట్నంలో అర్ధరాత్రి ఓ వివాహితపై హత్యయత్నం తీవ్ర కలకలం రేపుతుంది. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని HB కాలనీ, స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ లో మధ్య వివాహితపై కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.