Bengaluru: ‘‘పావురాల’’ సాయంతో దొంగతనం.. ‘‘పరివాల మంజా’’ వెరైటీ చోరీలు..
- పావురాల సాయంతో వెరైటీ దొంగతనాలు..
- బెంగళూర్లో పోలీసులకు చిక్కిన దొంగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్లో ఓ విచిత్రమైన దొంగతనాలు బయటపడ్డాయి. ఇళ్లను దోపిడీ చేసేందుకు ఓ వ్యక్తి ‘‘పావురాలను’’ ఉపయోగించడం సంచలనంగా మారింది. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేయడానికి దొంగ పావురాలను వాడుకుంటున్నాడే విషయం తెలిసి బెంగళూర్ సిటీ మార్కెట్ పోలీసులు షాక్ అయ్యారు. 38 ఏళ్ల అనుమానితుడు ‘‘పరివాల మంజా’’గా పిలువబడే మంజునాథ్ని పోలీసులు గుర్తించారు. హోసూర్కి చెందిన మంజునాథ్ బెంగళూర్లోని నాగరత్పేటలో నివాసం ఉంటున్నాడు. సిటీలో జరిగిన దాదాపు 50 చోరీల వెనక ఇతడి హస్తం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Read Also: EC: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు ఎన్నికల సంఘం లేఖ.. ప్రతినిధి బృందం కలిసేందుకు అనుమతి
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
మంజునాథ్ సింపుల్ టెక్నిక్తో దొంగతనాల్ని ప్లాన్ చేసే వాడు. ప్రధానంగా తాళాలు వేసిన ఇళ్లను, సెక్యూరిటీ లేని బహుళ అంతస్తుల భవనాలను టార్గెట్ చేసేవాడు. దొంగతనం చేయాలనుకున్న చోటుకు తన పావురాలతో అక్కడి వచ్చేవాడు. వాటిని అక్కడ విడిచిపెట్టేవాడు. ఇలా విడిచిపెట్టిన పావురాలు సహజంగా బిల్డింగ్స్ బాల్కనీ లేదా పైకప్పుపై వాలేవి. ఆ తర్వాత మంజునాథ్ పావురాల సాకుతో సదరు అపార్ట్మెంట్లోకి ప్రవేశించేవాడు. ఎవరైనా ప్రశ్నిస్తే.. తాను తన పావురాలను పట్టుకునేందుకు వచ్చానని చెప్పేవాడు.
తాళం వేసిన ఇళ్లను గుర్తించి ఇనుపరాడ్ని ఉపయోగించి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడేవాడు. ఇలా దొంగిలించిన వస్తువుల్ని హోసూర్లో అమ్మేవాడు. గతంలో అనేక సార్లు అరెస్టయినప్పటికీ, బెయిల్పై తిరిగి వచ్చి మళ్లీ నేరజీవితం ప్రారంభించేవాడు. మంజునాథ్ ఒంటరిగానే దొంగతనం చేసేవాదని, పగటిపూట ప్రజలు పనుల్లో ఉన్నప్పుడే చోరీలకు పాల్పడే వారని పోలీసులు వెల్లడించారు.
- Tags
- Bengaluru
- crime
- Crime News
- Pigeons
తాజావార్తలు
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Amaravati Seed Access Road: అమరావతికి మరో కీలక రహదారి.. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన చంద్రబాబు
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్కు సెకండ్ హోమ్గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!