Crime: లవర్తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్ కోసం వృద్ధుడి హత్య..
- గుజరాత్లో ఘోరం..
- లవర్తో పారిపోయిన వివాహిత మహిళ..
- తాను ఆత్మహత్య చేసుకున్నానని తప్పుదోవ పట్టించేందుకు వృద్ధుడి హత్య..
- రెండు నెలల తర్వాత పట్టుబడ్డ నిందితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: గుజరాత్లోని కచ్లో దారుణం జరిగింది. 27 ఏళ్ల వివాహిత, తన ప్రియుడితో పారిపోయేందుకు వేసిన ప్లాన్ వృద్ధుడి మరణానికి కారణమైంది. తాను ఆత్మహత్య చేసుకున్నానని కుటుంబసభ్యులను భ్రమింపచేయాలని వృద్ధుడిని ఈ జంట హత్య చేసి, దహనం చేసింది. నిజానికి చనిపోయిన వ్యక్తి అసలు ఎవరో వీరిద్దరికి తెలియదని, పారిపోతున్న క్రమంలో ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
రామి కేసరియా, అనిల్ గంగన్ అనే జంట ఒంటరిగా తిరుగుతున్న వ్యక్తిని చంపేసిన, ఆపై అతడి శరీరాన్ని కాల్చారు. జూలైలో నేరం జరిగితే మూడు నెలల తర్వాత వీరిద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామి, అనిల్ ఇద్దరు వృద్ధుడిని ప్రలోభపెట్టి హత్య చేసినట్లు తేలింది. రామి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అందర్ని నమ్మిస్తే, తనకు ఎలాంటి సమస్యలు లేకుండా లవర్తో హాయిగా ఉండొచ్చని భావించిందని పోలీసులు తెలిపారు.
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
Read Also: Suicide: మాజీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. తనను కేసులో ఇరికించిన వారి పేర్లు వీడియోలో వెల్లడి
రామి తన బట్టలు, ఫోన్, చెప్పులను కాలిపోతున్న శవం వద్ద వదిలిపెట్టింది. తద్వారా తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ నమ్మాలని భావించింది. జూలై 03న తమ ప్లాన్ అమలు పరిచిన కొద్దిసేపటికే గ్రామం వదిలి పారిపోయారు. అయితే, మరసటి రోజు అనిల్ వచ్చి రామి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో గమనించాడు. సంఘటనా స్థలంలో దొరికిన బట్టలు, మొబైల్ ఫోన్, కాలిపోయిన మృతదేహం కనిపించడంతో ఆ శవం రామిదే అని అంతా అంగీకరించారు.
రెండు నెలల తర్వాత అనిల్, రామి కచ్కి తిరిగి వచ్చారు. ఒక గదిని అద్దెకు తీసుకుని జీవించారు. అయితే, తాము తప్పించుకునే ప్లాన్ విఫలమైందని గ్రహించారు. సెప్టెంబర్ 27న తమ నేరాన్ని అంగీకరించి క్షమాపణలు కోరేందుకు రామి తండ్రి వద్దకు తిరిగి వచ్చింది. అయితే, రామి తండ్రి వారి క్షమాపణలను తిరస్కరించి, కేసు వివరాలను పోలీసులకు చెప్పాడు. తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. స్కెచ్ ద్వారా చనిపోయిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. విచారణలో ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. తాము మొదటి నుంచి ఈ కేసులో తప్పులను అనుమానించామని, సమగ్ర దర్యాప్తు తర్వాత విషయం వెలుగులోకి వచ్చిందని కచ్ ఎస్పీ వికాస్ నంద చెప్పారు.
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!