Crime: లవర్తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్ కోసం వృద్ధుడి హత్య..
- గుజరాత్లో ఘోరం..
- లవర్తో పారిపోయిన వివాహిత మహిళ..
- తాను ఆత్మహత్య చేసుకున్నానని తప్పుదోవ పట్టించేందుకు వృద్ధుడి హత్య..
- రెండు నెలల తర్వాత పట్టుబడ్డ నిందితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: గుజరాత్లోని కచ్లో దారుణం జరిగింది. 27 ఏళ్ల వివాహిత, తన ప్రియుడితో పారిపోయేందుకు వేసిన ప్లాన్ వృద్ధుడి మరణానికి కారణమైంది. తాను ఆత్మహత్య చేసుకున్నానని కుటుంబసభ్యులను భ్రమింపచేయాలని వృద్ధుడిని ఈ జంట హత్య చేసి, దహనం చేసింది. నిజానికి చనిపోయిన వ్యక్తి అసలు ఎవరో వీరిద్దరికి తెలియదని, పారిపోతున్న క్రమంలో ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
రామి కేసరియా, అనిల్ గంగన్ అనే జంట ఒంటరిగా తిరుగుతున్న వ్యక్తిని చంపేసిన, ఆపై అతడి శరీరాన్ని కాల్చారు. జూలైలో నేరం జరిగితే మూడు నెలల తర్వాత వీరిద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామి, అనిల్ ఇద్దరు వృద్ధుడిని ప్రలోభపెట్టి హత్య చేసినట్లు తేలింది. రామి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అందర్ని నమ్మిస్తే, తనకు ఎలాంటి సమస్యలు లేకుండా లవర్తో హాయిగా ఉండొచ్చని భావించిందని పోలీసులు తెలిపారు.
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
Read Also: Suicide: మాజీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. తనను కేసులో ఇరికించిన వారి పేర్లు వీడియోలో వెల్లడి
రామి తన బట్టలు, ఫోన్, చెప్పులను కాలిపోతున్న శవం వద్ద వదిలిపెట్టింది. తద్వారా తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ నమ్మాలని భావించింది. జూలై 03న తమ ప్లాన్ అమలు పరిచిన కొద్దిసేపటికే గ్రామం వదిలి పారిపోయారు. అయితే, మరసటి రోజు అనిల్ వచ్చి రామి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో గమనించాడు. సంఘటనా స్థలంలో దొరికిన బట్టలు, మొబైల్ ఫోన్, కాలిపోయిన మృతదేహం కనిపించడంతో ఆ శవం రామిదే అని అంతా అంగీకరించారు.
రెండు నెలల తర్వాత అనిల్, రామి కచ్కి తిరిగి వచ్చారు. ఒక గదిని అద్దెకు తీసుకుని జీవించారు. అయితే, తాము తప్పించుకునే ప్లాన్ విఫలమైందని గ్రహించారు. సెప్టెంబర్ 27న తమ నేరాన్ని అంగీకరించి క్షమాపణలు కోరేందుకు రామి తండ్రి వద్దకు తిరిగి వచ్చింది. అయితే, రామి తండ్రి వారి క్షమాపణలను తిరస్కరించి, కేసు వివరాలను పోలీసులకు చెప్పాడు. తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. స్కెచ్ ద్వారా చనిపోయిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. విచారణలో ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. తాము మొదటి నుంచి ఈ కేసులో తప్పులను అనుమానించామని, సమగ్ర దర్యాప్తు తర్వాత విషయం వెలుగులోకి వచ్చిందని కచ్ ఎస్పీ వికాస్ నంద చెప్పారు.
తాజావార్తలు
-
INDIA Bloc: 2 ఏళ్ల తర్వాత విపక్ష కూటమి భేటీ.. ఏం చర్చించారంటే..!
-
SlumDog Movie Teaser: ‘మా బతుకులతో ఆడుకుంటే వదలం’.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ ‘స్లమ్డాగ్’ టీజర్!
-
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్చరణ్
-
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!