Andhra Pradesh: అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లే!
- అత్తాకోడలిపై సామూహిక అత్యాచారం
- బాధితులను పరామర్శించిన మంత్రి సవిత
- పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
- ఆరుగురు నిందితుల్లో ముగ్గురు మైనర్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని నల్ల బొమ్మనపల్లిలో అత్తా కోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో హిందూపురం ప్రభుత్వం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి సవిత పరామర్శించారు. సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. వారి ఆదేశాలతో 24 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకోగలిగారన్నారు. నిందితుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా గాలించారు.. మరో గంటలో నిందితులను చూపిస్తామన్నారు. ఈ సంఘటనలో ఆరు మంది పాల్గొన్నారని.. వారిలో ముగ్గురు బాలురు కూడా ఉన్నారని మంత్రి తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వంలో జగన్ హయాంలో అత్యాచారాలు ఇటువంటి ఘటనలు జరిగాయన్నారు. వారు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
Read Also: Kurnoool: లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి.. జనంపై పడిన రథం
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
దసరా పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్తా కోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు దుండగులు. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్మన్గా ఉంటుంది ఓ కుటుంబం.. అయితే, రెండు బైక్లపై వచ్చిన దుండగులు.. కొడవలితో బెదిరించి ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్మన్గా చేరింది ఓ కుటుంబం.. ఐదు నెలల క్రితం ఇక్కడికి ఉపాధి కోసం వచ్చిన బళ్లారికి చెందిన ఆ కుటుంబం.. ఇక్కడే ఉంటున్నారు.. అయితే, శుక్రవారం రాత్రి సమయంలో రెండు బైక్లపై దుండగులు వచ్చినట్టుగా తెలుస్తోంది.. కొడవలితో బెదిరించి.. బలవంతంగా పక్కకు లాక్కెల్లి.. ఒకరి తర్వాత ఒకరిపై అత్తా కోడళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారు దుండగులు.. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు.. ఇక, జరిగిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లోనే ఆ వివరాలు తెలియనున్నాయి.
తాజావార్తలు
-
Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
-
Peddi : పెద్ది నాన్ తెలుగు స్టేట్స్ భారీ నష్టాల దిశగా.. ఓవర్ సీస్ అంతకుమించి?
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
ట్రెండింగ్
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!