Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..
- రూ.1.7 కోట్ల చోరీలో నిందితుల్ని పట్టించిన పోలీస్ డాగ్..
- గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: ఒక రైతు దగ్గర నుంచి రూ.1.07 కోట్లను దొంగతనం చేసిన దొంగల్ని పోలీస్ జాగిలం పట్టించింది. పెన్నీ అనే డాబర్మాన్ కుక్క నిందితులను రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకునేలా సాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కా తాలూకాలోని సరగ్వాలా గ్రామానికి చెందిన 52 ఏళ్ల రైతు తన గ్రామానికి సమీపంలోని లోథాల్ పురావస్తు ప్రదేశానికి సమీపంలోని భూమిని విక్రయించాడు. దీని ద్వారా అతడికి రూ. 1.07 కోట్లు వచ్చాయి. వచ్చిన డబ్బుతో మరోచోట భూమిని కొనుగోలు చేయాలని యోచిస్తున్నాడు. ఈ డబ్బును రెండు ప్లాస్టిక్ సంచుల్లో నింపి, అక్టోబర్ 10న తన శిథిలమైన ఇంటిలో దాచిపెట్టాడు.
Read Also: Starlink satellites: భూమి చుట్టూ 30,000 శాటిలైట్స్.. ఎలాన్ మస్క్ బిగ్ ప్లాన్..
Also Read
- Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
ఈ విషయం తెలిసిన అదే గ్రామానికి చెందిన బుధ సోలంకి, విక్రమ్ సోలంకి డబ్బును కాజేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే అక్టోబర్ 12న రాత్రి సమయంలో ఇంటి కిటికీల దగ్గర ఇటుకల్ని తీసి ఇంట్లోకి ప్రవేశించి, డబ్బును దొంగతనం చేశారు. మరుసటి రోజు ఉదయం దొంగతానికి సంబంధించిన సమాచారం అందిందని, ఆ ప్రాంతంలో 30 మంది అనుమానితులు, 14 మంది హిస్టరీ షీటర్లను విచారించడం ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
గురువారం పోలీస్ డాగ్ పెన్నీ బుధ ఇంటికి కొంతదూరంలో ఉన్న ప్రదేశంలో ఆగిపోయింది. అప్పటికే బుధ తమ అనుమానితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానితులు అంతా ఒక వరసలో నిలబడ్డారు. ఇందులో బుధ సోలంకి కూడా ఉన్నాడు. పెన్నీ అతడి వద్దకు వచ్చి ఆగిపోయింది. పోలీసులు బుధ ఇంటిని చెక్ చేయగా.. రూ.53.9 లక్షలు కనుగొన్నారు. తాము దొంగతనం చేసిన విషయాన్ని అంగీకరించాడు, ఈ చోరీలో విక్రమ్ సోలంకి ప్రమేయం ఉందని సమాచారం ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని విక్రమ్ ఇంటిలో పోలీసులు కనుగొన్నారు. రైతు తన ఇంటికి దూరంగా వెళ్తాడని బుధకు ముందే తెలుసు. దీంతో ఇద్దరు కలిసి పథకం ప్రకారం డబ్బులు కొట్టేశారు. దొంగతనం తర్వాత సమానంగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
In a remarkable breakthrough, the LCB & Koth Police Station of Ahmedabad Rural successfully detected a high-profile housebreaking case involving ₹1,07,80,000!
🐕 With crucial assistance from the Dog Squad’s Penny (handled by AHC Valjibhai), who traced the accused’s path and… pic.twitter.com/VqrAnpwYRL
— Harsh Sanghavi (@sanghaviharsh) October 17, 2024
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!