Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..
- రూ.1.7 కోట్ల చోరీలో నిందితుల్ని పట్టించిన పోలీస్ డాగ్..
- గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: ఒక రైతు దగ్గర నుంచి రూ.1.07 కోట్లను దొంగతనం చేసిన దొంగల్ని పోలీస్ జాగిలం పట్టించింది. పెన్నీ అనే డాబర్మాన్ కుక్క నిందితులను రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకునేలా సాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కా తాలూకాలోని సరగ్వాలా గ్రామానికి చెందిన 52 ఏళ్ల రైతు తన గ్రామానికి సమీపంలోని లోథాల్ పురావస్తు ప్రదేశానికి సమీపంలోని భూమిని విక్రయించాడు. దీని ద్వారా అతడికి రూ. 1.07 కోట్లు వచ్చాయి. వచ్చిన డబ్బుతో మరోచోట భూమిని కొనుగోలు చేయాలని యోచిస్తున్నాడు. ఈ డబ్బును రెండు ప్లాస్టిక్ సంచుల్లో నింపి, అక్టోబర్ 10న తన శిథిలమైన ఇంటిలో దాచిపెట్టాడు.
Read Also: Starlink satellites: భూమి చుట్టూ 30,000 శాటిలైట్స్.. ఎలాన్ మస్క్ బిగ్ ప్లాన్..
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ఈ విషయం తెలిసిన అదే గ్రామానికి చెందిన బుధ సోలంకి, విక్రమ్ సోలంకి డబ్బును కాజేయాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్లుగానే అక్టోబర్ 12న రాత్రి సమయంలో ఇంటి కిటికీల దగ్గర ఇటుకల్ని తీసి ఇంట్లోకి ప్రవేశించి, డబ్బును దొంగతనం చేశారు. మరుసటి రోజు ఉదయం దొంగతానికి సంబంధించిన సమాచారం అందిందని, ఆ ప్రాంతంలో 30 మంది అనుమానితులు, 14 మంది హిస్టరీ షీటర్లను విచారించడం ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
గురువారం పోలీస్ డాగ్ పెన్నీ బుధ ఇంటికి కొంతదూరంలో ఉన్న ప్రదేశంలో ఆగిపోయింది. అప్పటికే బుధ తమ అనుమానితుల జాబితాలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానితులు అంతా ఒక వరసలో నిలబడ్డారు. ఇందులో బుధ సోలంకి కూడా ఉన్నాడు. పెన్నీ అతడి వద్దకు వచ్చి ఆగిపోయింది. పోలీసులు బుధ ఇంటిని చెక్ చేయగా.. రూ.53.9 లక్షలు కనుగొన్నారు. తాము దొంగతనం చేసిన విషయాన్ని అంగీకరించాడు, ఈ చోరీలో విక్రమ్ సోలంకి ప్రమేయం ఉందని సమాచారం ఇచ్చాడు. మిగిలిన మొత్తాన్ని విక్రమ్ ఇంటిలో పోలీసులు కనుగొన్నారు. రైతు తన ఇంటికి దూరంగా వెళ్తాడని బుధకు ముందే తెలుసు. దీంతో ఇద్దరు కలిసి పథకం ప్రకారం డబ్బులు కొట్టేశారు. దొంగతనం తర్వాత సమానంగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
In a remarkable breakthrough, the LCB & Koth Police Station of Ahmedabad Rural successfully detected a high-profile housebreaking case involving ₹1,07,80,000!
🐕 With crucial assistance from the Dog Squad’s Penny (handled by AHC Valjibhai), who traced the accused’s path and… pic.twitter.com/VqrAnpwYRL
— Harsh Sanghavi (@sanghaviharsh) October 17, 2024
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!