Chhattisgarh : 17ఏళ్ల తర్వాత పట్టుబడ్డ సీరియల్ కిల్లర్.. రాళ్లతో కొట్టి చంపడం వీడి స్పెషాలిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : 17 ఏళ్లుగా వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్ను ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అతడు చేసిన హత్యల్లో ఎలాంటి సమాచారం గానీ, ఆధారంగానీ లభించలేదు. అయితే 17 ఏళ్ల తర్వాత చివరకు ఓ హత్య కేసులో పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ తర్వాత బయటపడ్డ విషయాలు తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ సీరియల్ కిల్లర్ ప్రత్యేకత ఏమిటంటే.. అతను ప్రతి హత్యకు రాళ్లను మాత్రమే ఉపయోగిస్తాడు. ఇది తప్ప మరే ఇతర ఆయుధాన్ని తన దగ్గర ఉంచుకోడు.
విషయం సర్కండ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. ఇక్కడ రిక్షా డ్రైవర్ను ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేశారు. మంగళవారం మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీని తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు, అతని పేరు ప్రదీప్ సింగ్ ఠాకూర్ (36). ఇద్దరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులు ప్రదీప్ను విచారించగా.. ప్రదీప్ చేసిన పాత హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. తన భార్యను 17 సంవత్సరాల క్రితం చంపాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో ఇద్దరు వ్యక్తులను హత్య చేశాడు.
Also Read
- Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
- ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
- Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
- Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్పై తల్హా సయీద్ విషం
Read Also:Harish Rao: మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల సంతోషం
ప్రస్తుతం నిందితులను పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. లింగాయడి దుర్గా గుడి సమీపంలో నివసించే సత్యన్నారాయణను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్యనారాయణ ప్రధాన్ ఈ-రిక్షా నడిపేవారు. కుటుంబంతో విడిగా అద్దె ఇంట్లో ఉండేవాడు. మంగళవారం ఉదయం చింగ్రాజ్పరాలోని స్వామి ఆత్మానంద పాఠశాలలో రక్తంతో తడిసిన అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు విచారణ ప్రారంభించగా.. సత్యనారాయణకు చింగ్రాజ్పరాకు చెందిన ప్రదీప్ సింగ్ ఠాకూర్ (36)తో వివాదం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ప్రదీప్ ఇంట్లో కనిపించకుండా పోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఇంతలో అతను నగరం నుంచి పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడని తేలింది. వెంటనే పోలీసులు అతనిని చుట్టుముట్టి పట్టుకున్నారు.
తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించేవాడు. అయితే అతడిని కఠినంగా విచారించడంతో ఎట్టకేలకు… హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన స్నేహితులు రింకూ సాహు, అజయ్ శ్రీవాస్తో కలిసి సత్యనారాయణను కొట్టానని చెప్పుకొచ్చాడు. అతడు పారిపోయి ఆత్మానంద్ స్కూల్ దగ్గరకు చేరుకున్నాడు. అయినా వారు సత్యనారాయణను వెంటపడి అక్కడ కూడా కొట్టారు. దీని తర్వాత అతను ఒక రాయిని తీసుకొని అతని తలపై విసిరాడు. దీంతో అతడు చనిపోయాడు.
Read Also:Director Son: హీరోగా ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ డెరైక్టర్ కొడుకు!
తాజావార్తలు
-
Python in Car: కారులో 7 అడుగుల కొండచిలువ.. బోనెట్ తెరవగానే షాక్..
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్బాస్ హౌస్లో రాంప్రసాద్కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!