Chhattisgarh : 17ఏళ్ల తర్వాత పట్టుబడ్డ సీరియల్ కిల్లర్.. రాళ్లతో కొట్టి చంపడం వీడి స్పెషాలిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : 17 ఏళ్లుగా వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్ను ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అతడు చేసిన హత్యల్లో ఎలాంటి సమాచారం గానీ, ఆధారంగానీ లభించలేదు. అయితే 17 ఏళ్ల తర్వాత చివరకు ఓ హత్య కేసులో పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ తర్వాత బయటపడ్డ విషయాలు తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ సీరియల్ కిల్లర్ ప్రత్యేకత ఏమిటంటే.. అతను ప్రతి హత్యకు రాళ్లను మాత్రమే ఉపయోగిస్తాడు. ఇది తప్ప మరే ఇతర ఆయుధాన్ని తన దగ్గర ఉంచుకోడు.
విషయం సర్కండ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. ఇక్కడ రిక్షా డ్రైవర్ను ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేశారు. మంగళవారం మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీని తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు, అతని పేరు ప్రదీప్ సింగ్ ఠాకూర్ (36). ఇద్దరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులు ప్రదీప్ను విచారించగా.. ప్రదీప్ చేసిన పాత హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. తన భార్యను 17 సంవత్సరాల క్రితం చంపాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో ఇద్దరు వ్యక్తులను హత్య చేశాడు.
Also Read
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
Read Also:Harish Rao: మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల సంతోషం
ప్రస్తుతం నిందితులను పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. లింగాయడి దుర్గా గుడి సమీపంలో నివసించే సత్యన్నారాయణను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్యనారాయణ ప్రధాన్ ఈ-రిక్షా నడిపేవారు. కుటుంబంతో విడిగా అద్దె ఇంట్లో ఉండేవాడు. మంగళవారం ఉదయం చింగ్రాజ్పరాలోని స్వామి ఆత్మానంద పాఠశాలలో రక్తంతో తడిసిన అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు విచారణ ప్రారంభించగా.. సత్యనారాయణకు చింగ్రాజ్పరాకు చెందిన ప్రదీప్ సింగ్ ఠాకూర్ (36)తో వివాదం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ప్రదీప్ ఇంట్లో కనిపించకుండా పోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఇంతలో అతను నగరం నుంచి పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడని తేలింది. వెంటనే పోలీసులు అతనిని చుట్టుముట్టి పట్టుకున్నారు.
తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించేవాడు. అయితే అతడిని కఠినంగా విచారించడంతో ఎట్టకేలకు… హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన స్నేహితులు రింకూ సాహు, అజయ్ శ్రీవాస్తో కలిసి సత్యనారాయణను కొట్టానని చెప్పుకొచ్చాడు. అతడు పారిపోయి ఆత్మానంద్ స్కూల్ దగ్గరకు చేరుకున్నాడు. అయినా వారు సత్యనారాయణను వెంటపడి అక్కడ కూడా కొట్టారు. దీని తర్వాత అతను ఒక రాయిని తీసుకొని అతని తలపై విసిరాడు. దీంతో అతడు చనిపోయాడు.
Read Also:Director Son: హీరోగా ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ డెరైక్టర్ కొడుకు!
తాజావార్తలు
-
SRH: టాప్ 4లో ఏ ఒక్క టీం సేఫ్ కాదు.. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరడం ఖాయమన్న మాజీ క్రికెటర్..
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!