Chhattisgarh : 17ఏళ్ల తర్వాత పట్టుబడ్డ సీరియల్ కిల్లర్.. రాళ్లతో కొట్టి చంపడం వీడి స్పెషాలిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : 17 ఏళ్లుగా వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్ను ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అతడు చేసిన హత్యల్లో ఎలాంటి సమాచారం గానీ, ఆధారంగానీ లభించలేదు. అయితే 17 ఏళ్ల తర్వాత చివరకు ఓ హత్య కేసులో పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ తర్వాత బయటపడ్డ విషయాలు తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ సీరియల్ కిల్లర్ ప్రత్యేకత ఏమిటంటే.. అతను ప్రతి హత్యకు రాళ్లను మాత్రమే ఉపయోగిస్తాడు. ఇది తప్ప మరే ఇతర ఆయుధాన్ని తన దగ్గర ఉంచుకోడు.
విషయం సర్కండ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. ఇక్కడ రిక్షా డ్రైవర్ను ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేశారు. మంగళవారం మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీని తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు, అతని పేరు ప్రదీప్ సింగ్ ఠాకూర్ (36). ఇద్దరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులు ప్రదీప్ను విచారించగా.. ప్రదీప్ చేసిన పాత హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. తన భార్యను 17 సంవత్సరాల క్రితం చంపాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో ఇద్దరు వ్యక్తులను హత్య చేశాడు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
Read Also:Harish Rao: మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల సంతోషం
ప్రస్తుతం నిందితులను పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. లింగాయడి దుర్గా గుడి సమీపంలో నివసించే సత్యన్నారాయణను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్యనారాయణ ప్రధాన్ ఈ-రిక్షా నడిపేవారు. కుటుంబంతో విడిగా అద్దె ఇంట్లో ఉండేవాడు. మంగళవారం ఉదయం చింగ్రాజ్పరాలోని స్వామి ఆత్మానంద పాఠశాలలో రక్తంతో తడిసిన అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు విచారణ ప్రారంభించగా.. సత్యనారాయణకు చింగ్రాజ్పరాకు చెందిన ప్రదీప్ సింగ్ ఠాకూర్ (36)తో వివాదం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ప్రదీప్ ఇంట్లో కనిపించకుండా పోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఇంతలో అతను నగరం నుంచి పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడని తేలింది. వెంటనే పోలీసులు అతనిని చుట్టుముట్టి పట్టుకున్నారు.
తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించేవాడు. అయితే అతడిని కఠినంగా విచారించడంతో ఎట్టకేలకు… హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన స్నేహితులు రింకూ సాహు, అజయ్ శ్రీవాస్తో కలిసి సత్యనారాయణను కొట్టానని చెప్పుకొచ్చాడు. అతడు పారిపోయి ఆత్మానంద్ స్కూల్ దగ్గరకు చేరుకున్నాడు. అయినా వారు సత్యనారాయణను వెంటపడి అక్కడ కూడా కొట్టారు. దీని తర్వాత అతను ఒక రాయిని తీసుకొని అతని తలపై విసిరాడు. దీంతో అతడు చనిపోయాడు.
Read Also:Director Son: హీరోగా ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ డెరైక్టర్ కొడుకు!
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!