Chhattisgarh : 17ఏళ్ల తర్వాత పట్టుబడ్డ సీరియల్ కిల్లర్.. రాళ్లతో కొట్టి చంపడం వీడి స్పెషాలిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : 17 ఏళ్లుగా వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్ను ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అతడు చేసిన హత్యల్లో ఎలాంటి సమాచారం గానీ, ఆధారంగానీ లభించలేదు. అయితే 17 ఏళ్ల తర్వాత చివరకు ఓ హత్య కేసులో పట్టుబడ్డాడు. అతడి అరెస్ట్ తర్వాత బయటపడ్డ విషయాలు తెలిసి పోలీసులే ఆశ్చర్యపోయారు. ఈ సీరియల్ కిల్లర్ ప్రత్యేకత ఏమిటంటే.. అతను ప్రతి హత్యకు రాళ్లను మాత్రమే ఉపయోగిస్తాడు. ఇది తప్ప మరే ఇతర ఆయుధాన్ని తన దగ్గర ఉంచుకోడు.
విషయం సర్కండ పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. ఇక్కడ రిక్షా డ్రైవర్ను ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేశారు. మంగళవారం మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీని తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు, అతని పేరు ప్రదీప్ సింగ్ ఠాకూర్ (36). ఇద్దరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులు ప్రదీప్ను విచారించగా.. ప్రదీప్ చేసిన పాత హత్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. తన భార్యను 17 సంవత్సరాల క్రితం చంపాడు. ఆ తర్వాత రెండేళ్లలో మరో ఇద్దరు వ్యక్తులను హత్య చేశాడు.
Also Read
Read Also:Harish Rao: మెడికల్ సీట్లు గణనీయంగా పెరగడం పట్ల సంతోషం
ప్రస్తుతం నిందితులను పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. లింగాయడి దుర్గా గుడి సమీపంలో నివసించే సత్యన్నారాయణను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సత్యనారాయణ ప్రధాన్ ఈ-రిక్షా నడిపేవారు. కుటుంబంతో విడిగా అద్దె ఇంట్లో ఉండేవాడు. మంగళవారం ఉదయం చింగ్రాజ్పరాలోని స్వామి ఆత్మానంద పాఠశాలలో రక్తంతో తడిసిన అతని మృతదేహం లభ్యమైంది. పోలీసులు విచారణ ప్రారంభించగా.. సత్యనారాయణకు చింగ్రాజ్పరాకు చెందిన ప్రదీప్ సింగ్ ఠాకూర్ (36)తో వివాదం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ప్రదీప్ ఇంట్లో కనిపించకుండా పోవడంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. ఇంతలో అతను నగరం నుంచి పారిపోవాలని ప్లాన్ చేస్తున్నాడని తేలింది. వెంటనే పోలీసులు అతనిని చుట్టుముట్టి పట్టుకున్నారు.
తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించేవాడు. అయితే అతడిని కఠినంగా విచారించడంతో ఎట్టకేలకు… హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. తన స్నేహితులు రింకూ సాహు, అజయ్ శ్రీవాస్తో కలిసి సత్యనారాయణను కొట్టానని చెప్పుకొచ్చాడు. అతడు పారిపోయి ఆత్మానంద్ స్కూల్ దగ్గరకు చేరుకున్నాడు. అయినా వారు సత్యనారాయణను వెంటపడి అక్కడ కూడా కొట్టారు. దీని తర్వాత అతను ఒక రాయిని తీసుకొని అతని తలపై విసిరాడు. దీంతో అతడు చనిపోయాడు.
Read Also:Director Son: హీరోగా ఎంట్రీకి రెడీ అవుతున్న స్టార్ డెరైక్టర్ కొడుకు!
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!