Uttar Pradesh: తాజాగా ఉత్తరప్రదేశ్లో మరో కలతపరిచే సంఘటన చోటు వేసుకుంది. నేడు (శుక్రవారం) ఉదయం శ్రావస్తి జిల్లాలోని కైలాసపూర్ మజ్రా మనిహార్ తారా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల మృతదేహాలు ఇంట్లో నుండి బయటపడ్డాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. మృతులు రోస్ అలీ అలియాస్ రఫిక్, అతని భార్య షహ్నాజ్, పిల్లలు తబస్సుం, మొయిన్, గుల్నాజ్గా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో రోస్ అలీ ముందుగా భార్య, పిల్లలను గొంతు నులిమి హత్య చేసి,…
Bhimavaram Double Murder: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మన్నా చర్చ్ ఎదురుగా ఉండే ఇంటిలో తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో…
Tragedy : విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలు లలిత తన అత్తను నిర్దాక్షిణ్యంగా హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. సాధారణ అగ్ని ప్రమాదంలా చూపించేందుకు లలిత చేసిన నాటకాలు షాకింగ్గా మారాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. లలిత ముందుగా ‘దొంగ–పోలీస్ ఆట’ పేరుతో అత్తను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో బింగించి కట్టేసింది. ఆ తరువాత క్రూరంగా ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించింది. నిప్పు అంటుకున్న…
Fake Liquor Case: నకిలీ మద్యం తయారీ కేసులో ఏడుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారణ ప్రారంభించారు.. వీరిని ఐదు రోజులపాటు విచారించనున్నారు.. కోర్టు ఆదేశాలతో నిందితులను జైలు నుంచి ఎక్సైజ్ కార్యాలయానికి శుక్రవారం ఉదయం తరలించారు.. కేసులో నిందితులుగా ఉన్న రవి, బాదల్ దాస్, ప్రదీప్ దాస్, శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణ్, రమేష్ బాబు, అల్లా భక్షు లను కస్టడీ కి తీసుకున్నారు. ఈ ఏడుగురు కూడా అద్దేపల్లి జనార్ధన్ కి నకిలీ…
Ganja Gang Attack: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు చోటుచేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆరుగురు యువకులు హాస్పిటల్ ముందు మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టించారు. హాస్పిటల్ ముందు మద్యం సేవించవద్దని హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించడంతో, ఆ యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు.…
Gang Rape: ఇన్స్టాగ్రామ్లో పరిచయం, ఓ మైనర్ బాలికకు నరకంలా మారింది. ఫ్రెండ్గా పరిచమైన వ్యక్తి మాయమాటలతో హోటల్కు రప్పించి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు బంధించి, గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.
Pocso Case : హైదరాబాద్ లో దారుణం జరిగింది. బోయిన్ పల్లిలో డ్యాన్స్ మాస్టర్ జ్ఞానేశ్వర్ సుబ్బు డ్యాన్స్ స్టూడియో నిర్వహిస్తున్నాడు. గత రెండు నెలలుగా అతని వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన నాలుగేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎవరూ లేని టైమ్ లో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. డ్యాన్స్ నేర్చుకునేందుకు వచ్చిన అమ్మాయిపై ఇలా ప్రవర్తించడంతో ఆమె చాలా భయపడిపోయింది. కొన్ని రోజులుగా డ్యాన్స్ స్కూల్ కు వెళ్లను అంటూ మారాం చేసింది. దీంతో…
Bengaluru: తన భార్యను పక్కా పథకంలో హత్య చేసిన బెంగళూర్ డాక్టర్ ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గత నెలలో నిందితుడైన డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నేరం జరిగిన కొన్ని వారాల తర్వాత నిందితులు, పలువురు మహిళకు సంచలన మెసేజ్లు పంపించాడు.
Online Betting : ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల బారి ఎంత ఘోరంగా ఉందో మరోసారి తెలంగాణలో చోటుచేసుకున్న ఘటన నిరూపించింది. కష్టపడి సంపాదించిన డబ్బు.. చివరికి ఈ వర్చువల్ ప్రపంచపు వలలో చిక్కుకుని ప్రాణాన్నే త్యాగం చేసిన యువకుడు. ఈసారి ఆ బాధితుడు సాధారణ వ్యక్తి కాదు.. ప్రజలకు రక్షణ కల్పించే పోలీస్ వ్యవస్థలో పనిచేసే కానిస్టేబుల్నే. సంగారెడ్డి జిల్లా కల్హేరు మండల కేంద్రానికి చెందిన సందీప్ (24) గత సంవత్సరం జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్లో…
చిన్న వివాదం ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. బెంగళూర్లోని ఒక ఆఫీసులో ‘‘ లైట్లు’’ ఆర్పే విషయంలో ఏర్పడిన వివాదం శనివారం తెల్లవారుజామున హత్యకు దారితీసింది. చిత్రదుర్గకు చెందిన 41 ఏళ్ల మేనేజన్ను భీమేష్ బాబును అతడి సహోద్యోగి డంబెల్తో కొట్టి చంపాడు. ఈ సంఘటన గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డేటా డిజిటల్ బ్యాంక్ కార్యాలయంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ కంపెనీ సినిమా షూటింగ్ వీడియోలను స్టోర్ చేస్తుంది.