HYD DONGALU ARREST: దొంగలు దొరికేశారు..
- కనకదుర్గ కాలనీలో జనవరి 15న 9 ఇళ్లలో చోరీ..
- కత్తులు, ఇతర మారణాయుధాలతో హల్ చల్..
- పోలీసులకు పట్టుబడిన ముగ్గురు దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD DONGALU ARREST: బంగారం ధర.. అందనంత రేంజ్కు పెరిగిపోతోంది. అసలే బంగారం అంటే విలువైనది.. ఇంకా రేటు పెరుగుతున్నా కొద్దీ విలువ మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయడమే కాదు.. ఇంట్లో ఉన్న బంగారాన్ని కాపాడుకునేందుకు కష్టాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురైంది. బంగారం చోరీ చేసేందుకు అంతర్రాష్ట్ర దొంగలు.. గోతికాడ నక్కల్లా ఉండడమే కాదు.. ఏకంగా గోడలు దూకి మరీ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. అందినకాడికి దోచుకెళ్తున్నారు. అలాంటి అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్ల కనకదుర్గ కాలనీలో జనవరి 15న 9 ఇళ్లలో చోరీకి తెగబడ్డారు అంతర్రాష్ట్ర దొంగలు. కత్తులు, ఇతర మారణాయుధాలతో హల్ చల్ చేశారు. 9 ఇళ్లల్లో తలుపులు, కిటికీలు పగలగొట్టి లోపలకు దూరారు. అంతే కాదు.. బీరువా తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులతోపాటు అందిన కాడికి నగదు దోచుకుని దర్జాగా వచ్చిన దారినే వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Read Also: DELHI WIFE MURDER: కమాండోకు కట్నం కాటు.. డంబెల్తో దాడి చేసి హత్య..
Also Read
- Vijayawada: ఇంద్రకీలాద్రిపై ఘోరం.. వారం వ్యవధిలో ఆలయంలో రెండు భారీ స్కామ్లు!
- Family Suicide Case: "నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి".. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. పండగపూట సొంతూళ్లకు వెళ్లి వచ్చే సరికి ఇళ్లు గుల్ల చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ చోరీలో ముగ్గురు దొంగలు పాల్గొన్నట్లు చెబుతున్నారు పోలీసులు. వారిని డిల్లీకి చెందిన మహాదేవ్ లాల్, పవన్ గుప్త, ఉత్తర ప్రదేశ్కి చెందిన మంగళ్ సింగ్గా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల 4 వేలతోపాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితులు దోచుకున్న బంగారాన్ని కరిగించిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పట్టుబడ్డ నిందితులపై ఇప్పటికే ఢిల్లీలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మహదేవ్ లాల్ తీహార్ జైలులో శిక్ష అనుభవించినట్లు పోలీసులు గుర్తించారు. పలు దోపిడీ కేసుల్లో పవన్ గుప్త, మంగళ్ సింగ్ తీహార్ జైలుకు వెళ్లిన సమయంలో ముగ్గురు ముఠాగా ఏర్పడి నేరాలు చేయడం స్టార్ట్ చేశారు.
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షా కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి.. బ్యాడ్ స్మెల్ కూడా రాదు!
-
Astrology: ఉదయం లేవగానే ఈ 3 రాశులవారు చేసే అలవాట్లు.. విజయానికి అదే కారణమా?
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!