HYD DONGALU ARREST: దొంగలు దొరికేశారు..
- కనకదుర్గ కాలనీలో జనవరి 15న 9 ఇళ్లలో చోరీ..
- కత్తులు, ఇతర మారణాయుధాలతో హల్ చల్..
- పోలీసులకు పట్టుబడిన ముగ్గురు దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD DONGALU ARREST: బంగారం ధర.. అందనంత రేంజ్కు పెరిగిపోతోంది. అసలే బంగారం అంటే విలువైనది.. ఇంకా రేటు పెరుగుతున్నా కొద్దీ విలువ మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయడమే కాదు.. ఇంట్లో ఉన్న బంగారాన్ని కాపాడుకునేందుకు కష్టాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురైంది. బంగారం చోరీ చేసేందుకు అంతర్రాష్ట్ర దొంగలు.. గోతికాడ నక్కల్లా ఉండడమే కాదు.. ఏకంగా గోడలు దూకి మరీ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. అందినకాడికి దోచుకెళ్తున్నారు. అలాంటి అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్ల కనకదుర్గ కాలనీలో జనవరి 15న 9 ఇళ్లలో చోరీకి తెగబడ్డారు అంతర్రాష్ట్ర దొంగలు. కత్తులు, ఇతర మారణాయుధాలతో హల్ చల్ చేశారు. 9 ఇళ్లల్లో తలుపులు, కిటికీలు పగలగొట్టి లోపలకు దూరారు. అంతే కాదు.. బీరువా తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులతోపాటు అందిన కాడికి నగదు దోచుకుని దర్జాగా వచ్చిన దారినే వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Read Also: DELHI WIFE MURDER: కమాండోకు కట్నం కాటు.. డంబెల్తో దాడి చేసి హత్య..
Also Read
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. పండగపూట సొంతూళ్లకు వెళ్లి వచ్చే సరికి ఇళ్లు గుల్ల చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ చోరీలో ముగ్గురు దొంగలు పాల్గొన్నట్లు చెబుతున్నారు పోలీసులు. వారిని డిల్లీకి చెందిన మహాదేవ్ లాల్, పవన్ గుప్త, ఉత్తర ప్రదేశ్కి చెందిన మంగళ్ సింగ్గా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల 4 వేలతోపాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితులు దోచుకున్న బంగారాన్ని కరిగించిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పట్టుబడ్డ నిందితులపై ఇప్పటికే ఢిల్లీలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మహదేవ్ లాల్ తీహార్ జైలులో శిక్ష అనుభవించినట్లు పోలీసులు గుర్తించారు. పలు దోపిడీ కేసుల్లో పవన్ గుప్త, మంగళ్ సింగ్ తీహార్ జైలుకు వెళ్లిన సమయంలో ముగ్గురు ముఠాగా ఏర్పడి నేరాలు చేయడం స్టార్ట్ చేశారు.
తాజావార్తలు
-
CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
-
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
-
India-Venezuela: భారత్కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
-
Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!