HYD DONGALU ARREST: దొంగలు దొరికేశారు..
- కనకదుర్గ కాలనీలో జనవరి 15న 9 ఇళ్లలో చోరీ..
- కత్తులు, ఇతర మారణాయుధాలతో హల్ చల్..
- పోలీసులకు పట్టుబడిన ముగ్గురు దొంగలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD DONGALU ARREST: బంగారం ధర.. అందనంత రేంజ్కు పెరిగిపోతోంది. అసలే బంగారం అంటే విలువైనది.. ఇంకా రేటు పెరుగుతున్నా కొద్దీ విలువ మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేయడమే కాదు.. ఇంట్లో ఉన్న బంగారాన్ని కాపాడుకునేందుకు కష్టాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురైంది. బంగారం చోరీ చేసేందుకు అంతర్రాష్ట్ర దొంగలు.. గోతికాడ నక్కల్లా ఉండడమే కాదు.. ఏకంగా గోడలు దూకి మరీ ఇంట్లోకి వచ్చేస్తున్నారు. అందినకాడికి దోచుకెళ్తున్నారు. అలాంటి అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచర్ల కనకదుర్గ కాలనీలో జనవరి 15న 9 ఇళ్లలో చోరీకి తెగబడ్డారు అంతర్రాష్ట్ర దొంగలు. కత్తులు, ఇతర మారణాయుధాలతో హల్ చల్ చేశారు. 9 ఇళ్లల్లో తలుపులు, కిటికీలు పగలగొట్టి లోపలకు దూరారు. అంతే కాదు.. బీరువా తాళాలు పగలగొట్టి బంగారం, వెండి వస్తువులతోపాటు అందిన కాడికి నగదు దోచుకుని దర్జాగా వచ్చిన దారినే వెళ్లిపోయారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Read Also: DELHI WIFE MURDER: కమాండోకు కట్నం కాటు.. డంబెల్తో దాడి చేసి హత్య..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. పండగపూట సొంతూళ్లకు వెళ్లి వచ్చే సరికి ఇళ్లు గుల్ల చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. ఈ చోరీలో ముగ్గురు దొంగలు పాల్గొన్నట్లు చెబుతున్నారు పోలీసులు. వారిని డిల్లీకి చెందిన మహాదేవ్ లాల్, పవన్ గుప్త, ఉత్తర ప్రదేశ్కి చెందిన మంగళ్ సింగ్గా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల 4 వేలతోపాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిందితులు దోచుకున్న బంగారాన్ని కరిగించిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పట్టుబడ్డ నిందితులపై ఇప్పటికే ఢిల్లీలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మహదేవ్ లాల్ తీహార్ జైలులో శిక్ష అనుభవించినట్లు పోలీసులు గుర్తించారు. పలు దోపిడీ కేసుల్లో పవన్ గుప్త, మంగళ్ సింగ్ తీహార్ జైలుకు వెళ్లిన సమయంలో ముగ్గురు ముఠాగా ఏర్పడి నేరాలు చేయడం స్టార్ట్ చేశారు.
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!