Shocking: అక్రమ సంబంధం.. మామపై పెట్రోల్ పోసి నిప్పటించిన కోడలి ప్రియుడు..
- తమిళనాడులో షాకింగ్ ఘటన..
- అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని మామపై హత్యాయత్నం..
- నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కోడలి ప్రియుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక వృద్ధుడిని నడిరోడ్డపై పెట్రోల్ పోసి తగలబెట్టడం, అతను సాయం కోసం రోడ్డుపై పరిగెత్తుకుంటూ వేడుకుంటున్న వీడియో వైరల్గా మారింది. జిల్లాలోని పణ్రుట్టి సమీపంలోని మాలిగంపట్టు గ్రామానికి చెందిన రాజేంద్రన్(70) అనే జీడిపప్పు రైతును ఆమె కోడలు, ప్రియుడు కలిసి కుట్ర చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.
Read Also: Border 2 : ‘బోర్డర్’ సినిమాలకు థియేటర్లో పెను ప్రమాదం!
Also Read
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్డ్రింక్తో హత్య
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో రాజేంద్రన్ తన గ్రామానికి చెందిన కందన్తో కలిసి బైక్పై మాలిగం పట్టు రోడ్డులో వెళ్తుండగా, అకస్మాత్తుగా కారుతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. మంటలతోనే రాజేంద్రన్ కేకలు వేస్తూ, సాయం కోరాడు. చివరకు అతడికి అంటుకున్న మంటల్ని స్థానికులు ఆర్పివేసి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో ఆయన కడలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మణికందన్(39), కుపేంద్రన్(29), పార్థిబన్(28)లను అరెస్ట్ చేశారు.
ప్రాథమిక విచారణలో రాజేంద్రన్ కొడుకు భూపతితో జయప్రియా(28)కి వివాహం జరిగింది. వీరికి 9 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భూపతి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి కోడలు జయప్రియా మామ ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే మణికందన్తో జయప్రియాకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన రాజేంద్రన్ కోడల్ని తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. మణికందన్కు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రాజేంద్రన్ను హత్య చేయాలని కుట్ర పన్నారు. మణికందన్ తన స్నేహితులతో కలిసి రాజేంద్రన్పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!