Rahul Dravid: ఆసియా కప్లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో భారత పేసర్ అవేష్ ఖాన్ ఆడే పరిస్థితి లేదని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియా సమావేశంలో వెల్లడించాడు. అవేష్ ఖాన్ జ్వరం బారిన పడ్డాడని.. అందుకే నెట్ ప్రాక్టీస్కు కూడా దూరం అయ్యాడని వివరించాడు. మరోవైపు పాకిస్థాన్ బౌలింగ్ లైనప్ బాగుందని.. వాళ్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ద్రవిడ్ ప్రశంసించాడు. ఈ సందర్భంగా పాకిస్థాన్ బౌలింగ్…
Mushfiqur Rahim: ఆసియా కప్లో ఘోరంగా విఫలమైన బంగ్లాదేశ్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్ట్ ఫార్మాట్లపై పూర్తి దృష్టి సారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఆసియా కప్లో రెండు మ్యాచ్లు ఆడిన ముష్ఫీకర్ రహీమ్ మొత్తం ఐదు పరుగులు…
Team India: సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టైటిల్ కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్న టీమిండియాకు బిగ్షాక్ తప్పేలా కనిపించడంలేదు. మోకాలి గాయంతో ఆసియా కప్కు దూరమైన భారత స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కు సైతం దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మోకాలి సర్జరీ నేపథ్యంలో జడ్డూ ప్రపంచకప్ ఆడకపోవచ్చని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. జడేజా కోలుకోవడానికి ఆరు నెలల సమయం కంటే ఎక్కువ పట్టవచ్చని అభిప్రాయపడింది.…
Ryan Burl: అంతర్జాతీయ క్రికెట్లో జింబాబ్వే దశాబ్దాలుగా ఆడుతున్నా ఆ జట్టు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో జింబాబ్వే ఆటగాళ్లకు స్పాన్సర్లు కూడా కరువయ్యారు. దీంతో ఆటగాళ్లు తమ క్రికెట్ కిట్ల కోసం బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాపై చెలరేగిన జింబాబ్వే లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్కు 15 నెలలుగా స్పాన్సర్లు లేరు. మరోవైపు సొంతంగా క్రికెట్ కిట్ను కొనే స్థోమత కూడా లేదు. షూస్ చిరిగిపోతే కొత్తవి కొనడానికి డబ్బుల్లేని దుస్థితిని ర్యాన్ బర్ల్…
AUS Vs ZIM: ఎన్నో సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా పసికూనగానే మిగిలిపోయిన జింబాబ్వే ఎట్టకేలకు చరిత్ర సృష్టించింది. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించి సంచలనం నమోదు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఏ ఫార్మాట్లో అయినా జింబాబ్వేకు ఇదే తొలి విజయం కావడం విశేషం. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైనప్పటికీ మూడో వన్డేలో జింబాబ్వే ఆటగాళ్లు తెగించి ఆడారు. దీంతో విజయం సొంతం చేసుకుని ఆస్ట్రేలియా లాంటి మేటి…
Asia Cup 2022: ఆసియా కప్లో తొలి మ్యాచ్లో ఆప్ఘనిస్తాన్ చేతిలో భంగపడ్డ శ్రీలంక.. రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్ను మట్టికరిపించి సూపర్-4 బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 180కి పైగా పరుగులు చేసినా శ్రీలంక ఛేదించి 2 వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. అటు శ్రీలంకపై పరాజయంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలోనూ బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. ముఖ్యంగా శ్రీలంకతో మ్యాచ్లో చివరి ఓవర్లో…
IND Vs HKG: ఆసియా కప్లో దుబాయ్ వేదికగా బుధవారం హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన హాంకాంగ్ 20 ఓవర్లు ఆడినా 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 40 పరుగుల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో…
IND Vs HKG: ఆసియా కప్లో భాగంగా హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ (21) నిరాశపరచగా.. ఫామ్తో తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్ (36) నత్తనడకన బ్యాటింగ్ చేశాడు. దీంతో పసికూన హాంకాంగ్పై టీమిండియా ఎంత స్కోరు చేస్తుందనే విషయంపై అభిమానుల్లో ఉత్కంఠ రేపింది. అయితే పాకిస్థాన్తో మ్యాచ్లో టచ్లోకి వచ్చినట్లు కనిపించిన విరాట్…
Asia Cup 2022: ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ జట్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ. ఆదివారం నాడు దాయాది దేశాల మధ్య జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయంలోపు భారత్, పాకిస్థాన్ జట్లు తమ ఓవర్లను పూర్తి చేయలేకపోయాయి. దీంతో రెండు జట్లు జరిమానా బారిన పడ్డాయి. ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్ రిఫరీ ముందు తమ తప్పును అంగీకరించారని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల…
IND Vs HKG: దుబాయ్ వేదికగా హాంకాంగ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా కీలక మార్పు చేసింది. పాకిస్థాన్తో టీ20లో రాణించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో కీపర్ రిషబ్ పంత్ను తుది జట్టులోకి తీసుకుంది. రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో పాండ్యా తమకు చాలా కీలక ఆటగాడు అని.. అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. ఈ మ్యాచ్లో పాండ్యా స్థానంలో పంత్ ఆడతాడని చెప్పాడు.…