Home
Cricket News
Cricket News News
-
VVS Laxman: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై వీవీఎస్ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా హైదరాబాదీ సొగసరి ఆటగాడు వీవీఎస్ లక్ష్మ ణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే, కేవలం న్యూజిలాండ్ టూర్కు మాత్రమే ఆయన హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడు. -
Hardik Pandya: సెమీస్లో ఓటమి బాధించింది.. కానీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది
Hardik Pandya: ఈ నెల 18 నుంచి జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత్, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, విలియమ్సన్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఓడిపోయినందుకు నిరాశగా ఉందన్నాడు. అయితే విజయం సాధించేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. తప్పులను సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. 2024 టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే… -
IPL 2023 Retention: ముగిసిన రిటెన్షన్ ప్రక్రియ.. ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత డబ్బుంది?
IPL 2023 Retention: ఐపీఎల్ 2023 సీజన్కు సంబంధించి రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. నవంబర్ 15వ తేదీ వరకు మాత్రమే బీసీసీఐ గడువు ఇవ్వడంతో అన్ని ఫ్రాంచైజీలు రిటైనింగ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. డిసెంబర్ 23న కేరళలోని కొచ్చి వేదికగా మినీ వేలం జరగనుంది. కొందరు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలివేశాయి. దీంతో ఆయా ఫ్రాంచైజీల పర్సు పెరిగింది. అత్యధికంగా కోల్కతా నైట్రైడర్స్ జట్టు 16 మంది ఆటగాళ్లను, ముంబై ఇండియన్స్ 13 మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేయగా..… -
IPL 2023: ఏకంగా 13 మంది ఆటగాళ్లను వదులుకున్న ముంబై ఇండియన్స్
IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ వచ్చే ఏడాది జరిగే మెగా లీగ్ కోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఏకంగా 13 మంది ఆటగాళ్లను ముంబై యాజమాన్యం వదులుకుంది. దీంతో ముంబై పర్స్లో రూ.20.5 కోట్లు మిగిలాయి. ఈ డబ్బుతో వచ్చే నెల 20న జరిగే మినీ వేలంలో సత్తా కలిగిన ఆటగాళ్ల కొనుగోలు చేసి వచ్చే సీజన్లో మరోసారి టైటిల్… -
IPL 2023: సన్రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుట్
IPL 2023: వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు సంబంధించి సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ను రిటెన్షన్ విధానంలో భాగంగా రిలీజ్ చేసింది. అతడితో పాటు వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ని కూడా సన్ రైజర్స్ వదిలేసింది. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కేవలం 12 మంది ఆటగాళ్లనే రిటైన్ చేసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ మిగతా ఆటగాళ్లను వేలంలోకి విడుదల చేసింది. కేవలం మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, ఫిలిప్స్, అబ్దుల్ సమద్,… -
Mahendra Singh Dhoni: ధోనీ ఖాతాలో మరో ట్రోఫీ.. సోషల్ మీడియాలో వైరల్
Mahendra Singh Dhoni: టీమిండియాకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరు అని అడిగితే అందరూ చెప్పే ఏకైక పేరు ధోనీ మాత్రమే. ఎందుకంటే ధోనీ కెప్టెన్సీలోనే టీమిండియాకు వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ సాధ్యమయ్యాయి. ధోనీ తర్వాత ఇప్పటివరకు ఒక్క కెప్టెన్ కూడా ఐసీసీ ట్రోఫీ సాధించలేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం… -
IPL 2023: ముంబై ఇండియన్స్ అభిమానులకు షాక్.. ఐపీఎల్కు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గుడ్బై
IPL 2023: వచ్చే ఏడాది ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందే అభిమానులకు షాక్ తగిలింది. ఐపీఎల్కు వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్లో 2010 నుంచి పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ముంబై టీమ్లో మార్పులు అవసరమని.. తాను ఇప్పుడు ఆ జట్టుకు ఆడలేకపోతున్నానని పొలార్డ్ పోస్ట్ చేశాడు. అయితే తాను ఎప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టుకు అండగానే ఉంటానని పొలార్డ్ తెలియజేశాడు. వచ్చే సీజన్ నుంచి ముంబై… -
Ramiz Raja: భారత ఆటగాళ్లపై వ్యంగ్యాస్త్రాలు.. బిలీయనీర్ ఆటగాళ్ల కంటే మా ఆటగాళ్లే నయం
Ramiz Raja: టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన అనూహ్యంగా సెమీస్ బెర్త్ కైవసం చేసుకుని అక్కడి నుంచి ఫైనల్కు చేరింది. అయితే మరో సెమీస్లో భారత్ ఓడిపోయి ఇంటిముఖం పట్టడంపై పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నాడు. టీమిండియా, బీసీసీఐని అవహేళన చేస్తూ మాట్లాడాడు. తమ టీమ్పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని.. అదే సమయంలో బిలియన్ డాలర్ల ఆటగాళ్లు ఉన్న టీమ్ ఇంటికెళ్లిందని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. గత నెలలోనే… -
BCCI: బీసీసీఐ దిద్దుబాటు చర్యలు.. రోహిత్, కోహ్లీలతో త్వరలో కీలక సమావేశం
BCCI: టీ20 ప్రపంచకప్లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సెమీస్లో ఇంగ్లండ్పై ఘోర వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలతో త్వరలో బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరితో భవిష్యత్ టీ20 జట్టుపై చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే టీ20లకు హార్దిక్ పాండ్యాను సారథిగా చేయడంతో పాటు టాలెంట్ ఉన్న కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే… -
Team India: అక్కడ టాప్గా నిలిస్తే.. కప్పు మాత్రం రాదు.. ఇది పక్కా..!!
Team India: 2021 టీ20 ప్రపంచకప్లో సెమీస్కు వెళ్లకుండానే వెనుతిరిగిన టీమిండియా ఈ ఏడాది మాత్రం సెమీస్కు వెళ్లి ఆశలు రేకెత్తించింది. కానీ సెమీస్లో ఇంగ్లండ్పై ఘోరంగా ఓటమి చెంది టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం టీమిండియాను దెబ్బతీసిందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ప్రపంచకప్ ఫైనల్ లేదా సెమీఫైనల్లో టీమిండియా వెనుదిరిగిన ప్రతీసారి భారత ఆటగాళ్లే టాప్ స్కోరర్గా ఉన్నారని.. ఈ అంశం భారత జట్టుకు శాపంగా మారిందని అభిమానులు కామెంట్…
తాజావార్తలు
-
Vaibhav: అది సార్ ‘వైభవ్ సూర్యవంశీ’ అంటే.. తిట్టిన నోళ్లే జైజైలు కొట్టాయి.. ఫిదా అయిన లంక ఆటగాళ్లు..
-
Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
-
Ammonia Gas Leak : తమిళనాడులో ఘోరం.. అమ్మోనియా లీక్.. 7 మంది మృతి.!
-
Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
-
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్డ్రాప్లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!