IND Vs SA: లైవ్ మ్యాచ్లో విశేష అతిథి.. వణికిపోయిన క్రికెట్ అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs SA: గౌహతి వేదికగా జరుగుతున్న టీమిండియా, దక్షిణాఫ్రికా రెండో టీ20 మ్యాచ్ను చూసేందుకు స్టేడియంలోకి విశేష అతిథి ప్రవేశించాడు. ఆ అతిథి ఎవరో అని తెగ ఆలోచించకండి. ఆ అతిథి పాము. లైవ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్లోకి పాము రావడంతో అభిమానులు భయంతో వణికిపోయారు. 7వ ఓవర్ పూర్తైన తర్వాత ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఒక్కసారిగా పాము గ్రౌండ్లోకి రావడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. పామును చూసి ఆటగాళ్లు కూడా హడలిపోయారు. అనంతరం గ్రౌండ్ సిబ్బంది పామును పట్టుకోవడంతో అందరూ శాంతించారు. పామును పట్టుకున్న అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
గ్రౌండ్లో పాము వీడియోను పలువురు మొబైళ్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. పాముకు కూడా టిక్కెట్లు విక్రయించారేమోనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన టీ20 టిక్కెట్ల కోసం అభిమానులు ఎంత కష్టపడ్డారో అందరూ చూశారు. ఇప్పుడు గౌహతి మ్యాచ్లో పాము ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లు ఆసక్తికరంగా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు.
Also Read
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
- Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
- BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
Read Also: Adipurush Teaser Review: మీసాల రాముడితో `ఆదిపురుష్`
కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా ఓపెనర్లు దుమ్ముదులిపారు. రోహిత్ నిదానంగా ఆడగా కేఎల్ రాహుల్ మాత్రం బౌండరీలతో రెచ్చిపోయాడు. వీళ్లిద్దరూ తొలి వికెట్కు 96 పరుగులు జోడించారు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ చేశాడు. రాహుల్ (57), రోహిత్ (43) అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్లో టీమిండియా 200 పరుగులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకోవచ్చు.
Snake 🐍 in the House #INDvsSA pic.twitter.com/CllrcwSfcJ
— Ashwani JP Singh (@ashwanijpsingh) October 2, 2022
తాజావార్తలు
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!