Mahendra Singh Dhoni: విజయవాడలో ధోనీ విగ్రహం.. ఖుషీ అవుతున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahendra Singh Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ అతడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా విజయవాడలో క్రికెట్ అభిమానులు ధోనీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీలో ధోనీ విగ్రహం కనిపిస్తోంది. ప్రస్తుతం ధోనీ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రికెటర్కు విగ్రహం పెట్టడం బహుశా ఇదే తొలిసారని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అటు ధోనీ వచ్చే ఐపీఎల్లో కూడా ఆడనున్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తన సారథ్యంలో ధోనీ ఎన్నోసార్లు టైటిల్ అందించాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవగా 2022 సీజన్లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐపీఎల్లో సీఎస్కే మరోసారి విజృంభించి ధోనీకి గ్రాండ్ వీడ్కోలు పలకాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Read Also: Salman Khan: రూ. 1000 కోట్లు రెమ్యూనిరేషన్.. నా కేసులకే సరిపోవు
Also Read
- Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
- Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
- BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
- India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
ధోనీ సారథ్యంలో టీమిండియా అన్ని రకాల ఐసీసీ టైటిళ్లను సొంతం చేసుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ సహా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. అటు టెస్టుల్లోనూ నంబర్వన్ ర్యాంకును సాధించింది. టీమిండియా తరఫున విజయవంతమైన కెప్టెన్ అంటే ధోనీ పేరు మాత్రమే గుర్తొస్తుంది. ధోనీ సారథ్యంలో కోహ్లీ, రోహిత్, రైనా, జడేజా, రాయుడు, ధావన్ లాంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. మొత్తానికి విజయవాడలో ధోనీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారనే చెప్పాలి. కానీ విజయవాడలో ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారో స్పష్టత రావాల్సి ఉంది.
MS Dhoni's statue in Vijayawada👌
📸: @TeluguMSDians pic.twitter.com/1PkoyyscrQ
— CricTracker (@Cricketracker) September 28, 2022
తాజావార్తలు
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!