T20 World Cup: టీ20 ప్రపంచకప్లో దాయాదులు తలపడితే మరోసారి చూడాలని క్రికెట్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. క్రికెట్లో భారత్-పాకిస్థాన్ తలపడుతుంటే ఆ మ్యాచ్ ఇచ్చే మజానే వేరు. అందులోనూ పాకిస్థాన్ను టీమిండియా ఓడిస్తే సంబరాలే సంబరాలు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో ఇప్పటికే ఈ రెండు జట్లు తలపడగా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు మెగా టోర్నీ నాకౌట్ దశకు చేరుకోవడంతో మరోసారి ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలని ఇరు దేశాల…
T20 World Cup: టీమిండియాతో ఈనెల 10న జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ తలపడనుంది. అయితే భారత్తో సెమీ ఫైనల్స్ కోసం సమాయాత్తం అవుతున్న ఇంగ్లండ్కు ఊహించని షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఈ మ్యాచ్కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గజ్జల్లో గాయంతో మలాన్ బాధపడుతున్నాడు. నెట్ ప్రాక్టీస్కు కూడా దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడుతున్న సమయంలోనే అతను అర్ధాంతరంగా గ్రౌండ్ నుంచి వెళ్లిపోయాడు. 15వ ఓవర్లో బౌండరీ వద్ద…
T20 World Cup: ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో సెంటిమెంట్ల గోల ఎక్కువైపోయింది. ఆడింది తక్కువ ఊహాగానాలు ఎక్కువ అన్నట్లు సాగుతోంది. ఆసియాలో బలమైన జట్లు టీమిండియా, పాకిస్థాన్తో పాటు న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీఫైనల్కు చేరాయి. అయితే టీమిండియాను 2011 ప్రపంచకప్ సెంటిమెంట్ ఊరిస్తుండగా.. పాకిస్థాన్కు 1992 ప్రపంచకప్ సెంటిమెంట్ ఆశలు రేపుతోంది. కన్ను లొట్టబోయి అదృష్టం కలిసొచ్చినట్లు నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్థాన్ అభిమానులు ఈ ప్రపంచకప్ మాదే అంటూ…
Srilanka Board: టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు. అత్యాచార ఆరోపణల కారణంగా ధనుష్క గుణతిలకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 29 ఏళ్ల మహిళను రోజ్ బేలోని ఇంట్లో కలిసిన గుణతిలక ఆమెపై అత్యాచారం చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో స్పష్టం చేశారు. ఈ మేరకు అతడు అరెస్ట్ కావడంతో ధనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్ల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డ్ ప్రకటించింది.…
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రస్తుతం తనదైన శైలిలో అద్భుత ఫామ్తో ముందుకు దూసుకుపోతున్నాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో ఆడిన ఐదు మ్యాచ్లలో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. కెరీర్లో ఎన్నో రికార్డులకు రారాజుగా మారిన అతడు తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. గత ఏడాది జనవరిలో ఐసీసీ ఈ అవార్డును ప్రవేశపెట్టగా తొలిసారి కోహ్లీ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. మొత్తం ముగ్గురు…
Rohit Sharma: టీ20 ప్రపంచకప్లో టీమిండియా సెమీస్కు దూసుకెళ్లింది. సూపర్-12లో ఉన్న అన్ని జట్లలో భారత్ ఖాతాలోనే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. నాలుగు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా 8 పాయింట్లతో టాపర్గా నిలిచింది. గ్రూప్-1లో టాపర్గా నిలిచిన న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కప్ మనదేనంటూ పలువురు టీమిండియా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రోహిత్ సెంటిమెంట్ టీమిండియాను ఊరిస్తోంది. ఎందుకంటే రోహిత్ కెప్టెన్గా చేసిన అన్ని ఫార్మాట్లలోనూ…
Team India: 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 15 ఏళ్లు గడిచినా మరోసారి టీమిండియా మాత్రం మరోసారి టీ20 ప్రపంచకప్ను ముద్దాడలేకపోయింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్లో మాత్రం భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే సెమీస్కు చేరిన రోహిత్ సేన ఇంగ్లండ్తో తలపడనుంది. సమష్టిగా ఆడితే ఇంగ్లండ్ను ఓడించి ఫైనల్కు చేరడం అసాధ్యమేమీ కాదని అభిమానులు విశ్వసిస్తున్నారు. అటు తొలి సెమీస్లో న్యూజిలాండ్ను ఓడించి పాకిస్థాన్ ఫైనల్…
South Africa: క్రికెట్లో దురదృష్టం వెంటాడే జట్టు ఏదైనా ఉందంటే అది దక్షిణాఫ్రికా మాత్రమే. ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో అందరికంటే ముందు సెమీస్ చేరుతుందని భావించిన జట్టు దక్షిణాఫ్రికా. కానీ అనూహ్యంగా దక్షిణాఫ్రికా సెమీస్ రేసు నుంచి వైదొలిగింది. బంగ్లాదేశ్పై భారీ విజయం, టీమిండియా అద్భుత గెలుపు చూసి దక్షిణాఫ్రికా సెమీస్కు వెళ్లడం లాంఛనమే అని అందరూ భావించారు. కానీ టోర్నీ ప్రారంభం, టోర్నీ ముగింపు ఆ జట్టు దురదృష్టాన్ని మరోసారి చాటిచెప్పాయి. సూపర్-12లో దక్షిణాఫ్రికా తన…
IND Vs ZIM: టీ20 ప్రపంచకప్లో అడిలైడ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండో మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. రోహిత్ (15) మరోసారి విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ 26 పరుగులు…
Roger Binny: టీ20 ప్రపంచకప్లో టీమిండియాకు ఐసీసీ సహరిస్తోందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన అఫ్రిది వ్యాఖ్యలపై పెదవి విప్పారు. అఫ్రిది చేసిన ఆరోపణలు సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు. ఐసీసీ టీమిండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించడం సరికాదని.. ఐసీసీ అన్ని జట్ల విషయంలో ఒకేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఐసీసీ పక్షపాతం…