T20 World Cup: టీ20 ప్రపంచకప్లో మరో సంచలనం నమోదైంది. పాకిస్థాన్ జట్టును జింబాబ్వే ఓడించింది. పెర్త్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే చారిత్రక విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యాన్ని కూడా పాకిస్థాన్ ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో బాగానే ఆడిన జింబాబ్వే అనంతరం పాక్ బౌలర్ల ధాటికి భారీ స్కోరు సాధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 పరుగులు…
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చేశాడు. గురువారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి రోహిత్ సత్తా చాటుకున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ అగ్రస్థానానికి చేరాడు. గతంలో ఈ రికార్డు యువరాజ్ పేరిట ఉండేది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ 34 సిక్సర్లు కొట్టగా…
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో 56 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 9 పరుగులకే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. నెదర్లాండ్స్ ఫీల్డర్లు రెండు సార్లు రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేశారు.…
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే కరోనా కారణంగా స్పిన్ బౌలర్ ఆడమ్ జంపా శ్రీలంకతో మ్యాచ్కు దూరం కాగా ఇప్పుడు స్టార్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కూడా కరోనా బారిన పడ్డాడు. బుధవారం సాయంత్రం మాథ్యూ వేడ్కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు తదుపరి మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28న మెల్బోర్న్ వేదికగా ఇంగ్లండ్తో ఆస్ట్రేలియా…
T20 World Cup: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కెరీర్లో అత్యుత్తమ ఫామ్ అందుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఆసియా కప్ నుంచి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది. మళ్లీ మునుపటి కోహ్లీ కనిపిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లో పాకిస్థాన్తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్ భారత్ అత్యుత్తమ ఇన్నింగ్స్లలో ఒకటని కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రశంసలు కురిపించాడు. కొన్ని నెలలుగా ఫామ్ను కోల్పోయి తీవ్ర విమర్శలకు గురైన…
T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే గ్రూప్-2లో దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తాజాగా గ్రూప్-1లో న్యూజిలాండ్-ఆప్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. ఒక్క బాల్ కూడా పడకుండానే అంపైర్లు ఈ మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఈ మెగా టోర్నీలో వరుణుడి ఖాతాలో రెండు మ్యాచ్లు చేరాయి. ఇప్పటివరకు టోర్నీలో సూపర్-12…
ICC Rankings: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో మ్యాచ్లో విశ్వరూపం చూపించిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఐసీసీ ర్యాంకుల్లోనూ తన సత్తా చాటుకున్నాడు. పాకిస్థాన్తో మ్యాచ్లో 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. టీమిండియా విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లో లాంగ్ జంప్ వేసి టాప్-10లోకి ప్రవేశించాడు. ఆసియా కప్ ఆరంభానికి ముందు 35వ ర్యాంకులో ఉన్న విరాట్ కోహ్లీ ఆ టోర్నీతో ఫామ్లోకి వచ్చాడు. దీంతో…
T20 World Cup: టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు నెదర్లాండ్స్తో మ్యాచ్కు విశ్రాంతి ఇస్తారని వస్తున్న వార్తలపై టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పందించాడు. ప్రస్తుతం పాండ్యా ఫిట్గానే ఉన్నాడని.. తదుపరి మ్యాచ్కు అతడికి విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. తాము ఎవ్వరికీ విశ్రాంతి ఇవ్వాలని కోరుకోవడం లేదని.. టీ20 ప్రపంచకప్లో ఇంకా మరింత ముందుకు వెళ్లే అనుకూలత తమకు ఉందన్నాడు. ఆటగాళ్లందరూ ఫామ్లోకి రావాల్సి ఉందని బౌలింగ్ కోచ్ పరాస్…
టీ20 ప్రపంచకప్లో దాయాది పాకిస్తాన్పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి భారత జట్టు శుభారంభం చేసింది. తీవ్ర ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో గెలిచిన టీమిండియా ఫుల్ జోష్తో ఉండగా.. పాక్ జట్టు చాలా కసిగా ఉంది. భారత్, పాక్ జట్లు మళ్లీ తలబడితే చూడాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు.
IND Vs PAK: టీ20 ప్రపంచకప్లో ఈరోజు అతి పెద్ద సమరం జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ వరల్డ్ కప్లో ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ మరోదానికి లేదు. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు లక్ష మంది అభిమానులు మెల్బోర్న్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో జరగనున్న మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. ప్రాక్టీస్ మ్యాచ్లో రాణించిన షమీని రోహిత్ జట్టులోకి తీసుకున్నాడు.…