T20 World Cup: హోబర్ట్ వేదికగా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో సులభంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (34), హ్యారీ టెక్టార్ (45) రాణించారు. శ్రీలంక బౌలర్లలో హసరంగ, తీక్షణ రెండేసి వికెట్లు తీయగా.. ఫెర్నాండో, లహిరు కుమార, కరుణరత్నె, ధనుంజయ డిసిల్వ…
Team India: మెల్బోర్న్ వేదికగా పాకిస్థాన్తో జరగనున్న మ్యాచ్కు ముందు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సెంటిమెంట్ అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. అక్టోబర్లో మ్యాచ్లు అంటే కోహ్లీకి పూనకం వస్తుందని.. ముఖ్యంగా 2011 నుంచి 2021 వరకు అక్టోబర్ 21-24 మధ్య తేదీల్లో టీమిండియా మ్యాచ్ ఆడితే విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈరోజు మ్యాచ్ జరిగే తేదీ అక్టోబర్ 23 కాబట్టి తమ స్టార్ చెలరేగిపోవడం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఇటీవల…
IND Vs PAK: మెల్బోర్న్ వేదికగా కాసేపట్లో భారత్-పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో స్టేడియం పరిసరాల్లో సందడి నెలకొంది. దాయాదుల మహాసమరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నారు. భారత జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షం పడకపోవడంతో భారత్ అభిమానులు ఖుషీలో ఉన్నారు. ఈరోజు వరుణుడు పక్క దేశాలకు వెళ్లిపోవాలని ప్రార్థిస్తు్న్నారు. ఈ మ్యాచ్లో భారత్ గెలిచి టోర్నీలో శుభారంభం ఇవ్వానలి కోరుకుంటున్నారు.…
Ind Vs Pak: కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. ప్రపంచకప్ లాంటి టోర్నీలో దాయాది దేశాలు పోటీ పడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తే వచ్చే మజానే వేరు. ఈ ప్రపంచకప్కే ఈ మ్యాచ్ హైలెట్ అని ముందు నుంచి ప్రచారం చేస్తూనే వచ్చారు. ఈ మ్యాచ్ను చూసే మెల్ బోర్న్ స్టేడియంలో సీట్ల సామర్థ్యం 90వేలు అయితే అమ్ముడుపోయిన టిక్కెట్లు లక్ష…
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో శనివారమే సూపర్-12 మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. రెండో రోజే టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య మెల్బోర్న్ వేదికగా ఈరోజు మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ గెలిచి.. పాక్పై ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ సేన ఉవ్వళ్లూరుతోంది. అయితే అందరి కళ్లు ఇరు జట్ల ఆటగాళ్లపై కాకుండా వరుణుడిపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్కు వర్షం…
T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో సూపర్-12 ప్రారంభమైన తొలిరోజే సంచలనం నమోదయ్యేది. అయితే ఆఫ్ఘనిస్తాన్ 112 పరుగులు మాత్రమే చేయడం ఇంగ్లండ్కు కలిసొచ్చిందని చెప్పాలి. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆప్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. 113 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లివింగ్ స్టోన్ 29 పరుగులు…
T20 World Cup: టీ20 ప్రపంచకప్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఇప్పటికే మెగా టోర్నీ నుంచి వెస్టిండీస్ లాంటి టీమ్ ఇంటి బాట పట్టింది. ఇప్పుడు సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో ఆస్ట్రేలియాకు పరాభవం ఎదురైంది. సూపర్-12లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 201 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను 111 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆస్ట్రేలియా పతనానికి…
T20 World Cup: టీ20 ప్రపంచకప్లో అసలు సిసలు పోరు ఈరోజే ప్రారంభమైంది. సూపర్-12లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ముందు 201 పరుగులు భారీ టార్గెట్ నిలిచింది. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే 92 పరుగులతో తుదికంటా…
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్లో శుక్రవారంతో క్వాలిఫయర్ మ్యాచ్లు ముగిశాయి. శనివారం నుంచి సూపర్-12 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. క్వాలిఫయర్ మ్యాచ్ల నుంచి నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధించాయి. గ్రూప్-ఎ నుంచి శ్రీలంక, నెదర్లాండ్ అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి జింబాబ్వే, ఐర్లాండ్ క్వాలిఫై అయ్యాయి. వెస్టిండీస్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. గత ప్రపంచకప్లో ఆడిన నమీబియా, స్కాట్లాండ్ స్థానంలో ఈ వరల్డ్ కప్కు నెదర్లాండ్స్, జింబాబ్వే వచ్చాయి. సూపర్-12లో…
Virat Kohli: మైదానంలో అగ్రెసివ్గా ఉండే టీమిండియా క్రికెటర్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అతడు ఎలాంటి భావోద్వేగాన్ని దాచుకోడు. సంతోషం వచ్చినా, కోపం వచ్చినా దానిని బయటపెట్టేస్తుంటాడు. అందుకే విరాట్ను చాలా మంది అభిమానులు ఇష్టపడుతుంటారు. అయితే టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా శుక్రవారం నాడు విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఈనెల 23న పాకిస్థాన్తో టీమిండియా తలపడనుంది. ఈ సందర్భంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సమయంలో…