IND Vs NZ: ‘టై’గా ముగిసిన మూడో టీ20.. సిరీస్ టీమిండియాదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs NZ: నేపియర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 టైగా ముగిసింది. టీమిండియా ఇన్నింగ్స్ 9వ ఓవర్ ముగిసిన తర్వాత వర్షం పడటంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్ టై అయిందని అంపైర్లు ప్రకటించారు. డీఎల్ఎస్ ప్రకారం స్కోర్లు సమం అయ్యాయని తెలిపారు. తొలుత న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. వర్షం పడటంతో మ్యాచ్ సమంగా ముగిసిందని అంపైర్లు పేర్కొన్నారు. దీంతో మూడు టీ20ల సిరీస్ను 1-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. తొలి టీ20 వర్షంతో రద్దు కాగా.. రెండో టీ20లో భారత్ విజయం సాధించింది.
Read Also: UN chief Antonio Guterres: ప్రతీ 11 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతోంది..
Also Read
- Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- PV Sindhu: క్రీడా రంగంలో ఏఐ విప్లవం.. అథ్లెట్ల కోసం ‘టెంపుల్’ స్మార్ట్ సెన్సార్ ప్యాచ్.. ప్రత్యేక ఆకర్షణగా పీవీ సింధు!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
కాగా ఈ మ్యాచ్లో బౌలింగ్లో రాణించిన మహ్మద్ సిరాజ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అటు సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కైవసం చేసుకున్నాడు. గతంలోనూ వర్షం కారణంగా పలు మ్యాచ్లు టైగా ముగిశాయి. 2003 వన్డే ప్రపంచకప్లో శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్, 2011లో లార్డ్స్లో ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లు కూడా వర్షం కారణంగా ఆగిపోవడంతో టైగా ముగిశాయి.
Read Also: IND Vs NZ: న్యూజిలాండ్తో మూడో టీ20.. టీమిండియా టార్గెట్ 161 పరుగులు
కాగా ఈ మ్యాచ్లో రెండు జట్లకు విజయ అవకాశాలు సమానంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కాసేపటి తరువాత వర్షం ఆగిపోయినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదన్నారు. అంతకుముందు ఓపెనర్ ఇషాన్ కిషాన్ 10 పరుగులకే అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ (11) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అవ్వగా.. సూర్య కుమార్ యాదవ్ (13) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాటపట్టాడు. అయితే మరో ఎండ్లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (30) వేగంగా ఆడడంతో భారత్ స్కోరు 9 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులకు చేరుకుంది.
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!