ఒమిక్రాన్ భారతదేశాన్ని సైతం వణికిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడం, కోవిడ్-19 కేసుల సంఖ్య కూడా రోజురోజుకు అధికసంఖ్యలో నమోదు కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి. మార్కెట్ ప్రాంతంలో దుకాణాలను “ఆడ్, ఈవెన్” పధ్దతిలో తెరిచేందుకు అనుమతించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన “ఎల్లో అలర్ట్“ మరి కొంతకాలం కొనసాగవచ్చు. కోవిడ్ పాజిటివిటీ రేటు…
కరోనా సమయంలో ఆయుర్వేద మెడిసిన్తో వార్తల్లో నిలిచిన నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య.. ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోన్న సమయంలో.. తాను ఒమిక్రాన్ను కూడా మందు తయారు చేశానని ప్రకటించారు.. దీంతో.. ఆయన నివాసం ఉండే కృష్ణపట్నానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు.. అయితే, అక్కడే ఆనందయ్యకు ఊహించని షాక్ తగిలింది… ఓవైపు ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దంటూ కృష్ణపట్నం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేయగా… అసలు, నీ మందుకు ఉన్న అనుమతి ఏంటి?…
కరోనా వీరవిహారం చేస్తోంది. కొద్దిపాటి నిర్లక్ష్యం కరోనా బాధితులకు శాపం కానుంది. సిద్దిపేట పట్టణంలో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ వేయిస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మూడవ వార్డులో యువజన సంఘల సభ్యులు వ్యాక్సిన్ వేసుకోని వారి ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించడం కనిపించింది. వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దంటున్నారు అధికారులు. తెలంగాణలో కరోనా మొదటి డోస్ సుమారుగా వంద శాతం పూర్తయింది. రెండో డోస్ వేయించుకోవడానికి జనం సిద్ధం అవుతున్నారు. కొంతమంది యువత వ్యాక్సిన్ పట్ల…
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర, అమిత్ షా సభలు ఇప్పట్లో లేనట్టేనా? మంచి దూకుడు మీదున్న బీజేపీ స్పీడ్ కు ఆటంకాలు వచ్చాయా? ఒమిక్రాన్ ఎఫెక్ట్ కారణంగానే బీజేపీ యాత్రలు వాయిదా పడ్డాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. డిసెంబర్ 15 తరవాత ప్రజా సంగ్రామ యాత్ర ఉంటుందని గతంలో ప్రకటించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. అయితే, ఇప్పటి వరకూ యాత్ర షెడ్యూల్ ఖరారు కాలేదు. ఒకవైపు ఒమిక్రాన్ కేసులు..…
కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. కోట్లాదిమంది అయినవారిని కోల్పోయారు. అయితే కరోనా కారణంగా ఫార్మా రంగం పరిస్థితి మూడు వ్యాక్సిన్లు.. ఆరు శానిటైజర్లలా మారింది. గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిన కంపెనీలు, సాధారణ జనం ఇప్పడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఒమిక్రాన్ రూపంలో అలజడి రేగుతోంది. మనదేశంలో గత నెలలో మందుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నవంబరు నెలలో మందుల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చినప్పుడు 6.6 శాతం పైగా…
హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది హెల్మెట్లు వున్నా పెట్టుకోకుండా ప్రయాణాలు చేస్తుంటారు. తాజాగా కోవిడ్ మహమ్మారి వేళ హెల్మెట్ పెట్టుకోకుండా, ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. సోషల్ మీడియా వేదికగా ట్రాఫిక్ పోలీసులు అలాంటి ఘనుల ఫోటోలను షేర్ చేస్తున్నారు. హెల్మెట్ లేకపోవడమే కాకుండా మాస్కులు లేకుండా యథేచ్ఛగా నగర రోడ్లపై తిరిగేస్తున్నారు. వైద్య శాఖ అధికారులు ఒకవైపు ఒమిక్రాన్…
ప్రపంచదేశాలను ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి వణికిస్తోంది.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్.. చాపకింద నీరులా విస్తరిస్తోంది… ఇదే సమయంలో.. ఒమిక్రాన్ అంత సీరియస్ కాదనే వాదనలు కూడా ఉన్నాయి.. డెల్టా వేరియంట్తో పోలిస్తే జెట్ స్పీడ్తో విస్తరిస్తున్నా.. ప్రాణాలకు ముప్పులేదని.. డెత్ రేట్ తక్కువని చెబుతున్నారు.. కానీ, ఒమిక్రాన్ను లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు.. ఇప్పటికే ఫస్ట్ వేవ్ చూశాం.. కోవిడ్ సెకండ్ వేవ్ సృష్టించిన విలయాన్ని ఇంకా మర్చిపోలేదు.. ఇప్పుడు…
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది… ఇప్పటికే భారత్లో ఫస్ట్వేవ్, సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోవడమే కాదు.. ఆర్థికంగా కూడా అన్ని రంగాలను దెబ్బ కొట్టింది ఈ మహమ్మారి.. మరోవైపు… సౌతాఫ్రికాలో తాజాగా వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్ పెడుతోంది.. డెల్టా వేరియెంట్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే.. ఒమిక్రాన్ రూపంలో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది..…
తెలంగాణలో నిన్న మొన్నటివరకూ కరోనా నియంత్రణలో వుంది. అయితే విదేశాలనుంచి విరుచుకుపడుతున్న ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది. విదేశాలనుంచి వచ్చేవారి విషయంలో నియంత్రణ చేపట్టింది. అయితే, తెలంగాణలో కరోనా నియంత్రణకు ఎలాంటి పటిష్ట చర్యలు చేపట్టకపోవడం, కరోనా నియంత్రణకు మాస్క్ ధరించక పోవడంపై లోకాయుక్త సీరియస్ అయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టకకపోవడం, స్మోకింగ్ పై సుమోటోగా కేసు స్వీకరించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోకాయుక్త. గుంపులుగా…
దేశంలో కరోనా వ్యాక్సిన్లు యుద్ధ ప్రాతిపదికన వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు బామ్మలు సమ్ థింగ్ స్సెషల్ గా నిలిచారు. వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఔరా అనిపించారు. జిల్లాలో కరోనా టీకా తీసుకున్నారు ఈ ఇద్దరు వందేళ్ల వృద్ధులు. భీం పూర్ మండలం తాంసీ కే కు చెందిన వాంకడే తాను బాయి, గాదిగూడకు చెందిన సాబ్లే కమలా బాయిలు కరోనా వ్యాక్సిన్ వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వీరి వయసు 100కు పైమాటే. ఈ వయసులోనూ ఎంతో బాధ్యతగా,…