భారత్లో కరోనా థర్డ్వేవ్..! తాజా హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది… ఇప్పటికే భారత్లో ఫస్ట్వేవ్, సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.. పెద్ద సంఖ్యలో ప్రాణాలు పోవడమే కాదు.. ఆర్థికంగా కూడా అన్ని రంగాలను దెబ్బ కొట్టింది ఈ మహమ్మారి.. మరోవైపు… సౌతాఫ్రికాలో తాజాగా వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు అన్ని దేశాలను టెన్షన్ పెడుతోంది.. డెల్టా వేరియెంట్ తగ్గుముఖం పట్టిందని సంతోషించే లోపే.. ఒమిక్రాన్ రూపంలో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది.. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఇప్పటకే 57 దేశాలను చుట్టేసింది.. భారత్లోకి కూడా ప్రవేశించింది. ఇప్పటివరకు మొత్తం 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి దేశంలో దడ పుట్టిస్తోంది. సెకండ్ వేవ్ మిగిల్చిన నష్టాన్ని మర్చిపోకముందే.. ఇక, థర్డ్ వేవ్ ముప్పు తప్పదన్న హెచ్చిరకలు ఇప్పుడు కలవరానికి గురిచేస్తున్నాయి.
Read Also: కుప్పంలో అలా ఎందుకు జరిగింది..? చంద్రబాబు పోస్టుమార్టం
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
భారత్లో థర్డ్వేవ్పై వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. జనవరిలో థర్డ్వేవ్ ప్రారంభం అవుతుందని.. అది ఫిబ్రవరి నాటికి గరిష్ట స్థాయికి చేరుకోవచ్చు అని ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ తెలిపారు.. ఇక థర్డ్వేవ్లో రోజుకు 1 లక్షల నుంచి 1.5 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. ఓ కార్యక్రమంలో కోవిడ్పై మాట్లాడిన ఆయన.. కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో ఫిబ్రవరి నాటికి దేశంలో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. జనవరి నుంచే థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందని హెచ్చరించారు. ఇది, సెకండ్ వేవ్ కంటే కాస్త తక్కువగానే ఉంటుంది. ఒమిక్రాన్ యొక్క తీవ్రత డెల్టా వేరియంట్లో కనిపించే దానిలా లేదన్నారు.. ఇక, సౌతాఫ్రికాలో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కావడంలేదని తెలిపారు మనీంద్ర అగర్వాల్.. ఇది సంతోషించాల్సిన విషయమని పేర్కొన్న ఆయన.. ఒమిక్రాన్ అధిక ట్రాన్స్మిసిబిలిటీని చూపించినప్పటికీ.. దాని తీవ్రత డెల్టా వేరియంట్ కంటే తక్కువగానే ఉంటుందని అంచనావేశారు. మరోవైపు కట్టడి చర్యలపై స్పందిస్తూ.. ఒమిక్రాన్ నివారణకు లాక్డౌన్ అవసరం లేదు.. రాత్రి కర్ఫ్యూ లాంటివి సరిపోతాయని అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా నిబంధనలు అంతా పాటించాలని.. అప్పుడే ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోగలమని విజ్ఞప్తి చేశారు ఐఐటీ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!