కరోనా వీరవిహారం చేస్తోంది. కొద్దిపాటి నిర్లక్ష్యం కరోనా బాధితులకు శాపం కానుంది. సిద్దిపేట పట్టణంలో యుద్ధ ప్రాతిపదికన కరోనా వ్యాక్సిన్ వేయిస్తున్నారు అధికారులు, ప్రజాప్రతినిధులు. మూడవ వార్డులో యువజన సంఘల సభ్యులు వ్యాక్సిన్ వేసుకోని వారి ఇంటింటికి వెళ్లి మరీ వ్యాక్సిన్ వేయించడం కనిపించింది. వ్యాక్సిన్ విషయంలో అపోహలు వద్దంటున్నారు అధికారులు.
తెలంగాణలో కరోనా మొదటి డోస్ సుమారుగా వంద శాతం పూర్తయింది. రెండో డోస్ వేయించుకోవడానికి జనం సిద్ధం అవుతున్నారు. కొంతమంది యువత వ్యాక్సిన్ పట్ల విముఖతతో వున్నారు. సిద్దిపేటలో వ్యాక్సిన్ వేయించుకోని వారిని వార్డ్ మెంబర్ తిరుమల్ రెడ్డి చైతన్యపరుస్తున్నారు. ఇంటింటికి తిరిగి మరీ వ్యాక్సిన్ వేయిస్తున్నారు. కొందరికి బలవంతంగా వ్యాక్సిన్ వేయిస్తున్నారు.