కరోనా మహమ్మారి మొదటి వేవ్ను సమర్ధవంతంగా ఎదర్కొన్న చాలా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రజులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు మళ్లీ లాక్డౌన్ అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. 2020 లో కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కాన్బెర్రాలో భారీగా కేసులు బయటపడటంతో లాక్డౌన్ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈరోజు నుంచి…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో సాధారణ జీవనం ప్రారంభం అయింది. ఇక ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కొత్తగా 453 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,51,288కి చేరింది. ఇందులో 6,39,456 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,137 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ముగ్గురు…
దేశంలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దక్షిణాదిన కేరళతో పాటు అటు మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి. మొదటివేవ్ను సమర్ధవంతంగా ఎదుర్కొని తక్కువ కేసులతో బయటపడ్డ ఈశాన్య రాష్ట్రాలు సెకండ్ వేవ్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడ కేసులు బయటపడుతున్నాయి. తాజారా మిజోరాం రాష్ట్రంలో 576 కొత్త కేసులు నమోదవ్వగా అందులో 128 మంది చిన్నారులు ఉండటం ఆందోళన…
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలో 1859 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,88,910కి చేరింది. ఇందులో 19,56,627 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,688 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 13 మంది మృతిచేందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13,595 మంది మృతిచెందారు. ఇక…
కరోనా మహమ్మారి వివిధ రకాలుగా మ్యూటేషన్ చెంది బలమైన వేరియంట్లుగా మార్పులు చెంది వైరస్ను వేగంగా విస్తరింపజేస్తున్నాయి. వైరస్ కట్టడికి వ్యాక్సిన్లు తీసుకొచ్చినా, వాటికి లొంగకుండా తప్పించుకొంటూ రోగాలను కలిగిస్తున్నాయి. కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా లాభం ఉండటం లేదు. వైరస్ల ఆట కట్టించేందుకు ఆమెరికాలోని యూనివర్శిటి ఆఫ్ కొలరాడో బౌల్టర్ విశ్వవిద్యాలయం వినూత్నమైన పరిశోధనలు చేసింది. యాంటీబాడీల నుంచి తప్పించుకొంటున్న కరోనా, హెచ్ఐవీ, ఇన్ఫ్లూయెంజా వంటి వైరస్లను కట్టడి చేసేందుకు నూతన విధానాన్ని అభివృద్ధి చేశారు.…
కరోనా మహమ్మారిపై ప్రపంచం పోరాటం చేస్తున్నది. కరోనా నుంచి ఇప్పటి వరకూ ఏ దేశం కూడా పూర్తిగా కోలుకోలేదు. తగ్గినట్టే తగ్గి కేసులు మరలా పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాల్లో టీకాలు వేగంగా అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొన్ని రకాల టీకాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ధికంగా అభివృద్ధి చెందిన దేశాలు ముందుగానే కోట్లాది డోసులు సమకూర్చుకున్నాయి. మధ్య, పేద దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇండియాలో…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా? అంటే కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.. సిక్కోలులో పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతుండటంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందనుకుంటున్న వేళ కేసులు పెరగడం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలవరాన్ని పుట్టిస్తోంది. సరిగ్గా 4నెలల క్రితం రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న శ్రీకాకుళం.. ఆ తర్వాత కఠినమైన లాక్డౌన్ నిబంధనలతో వైరస్ను నిలువరించింది. అయితే, మొన్నటి వరకూ…
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది… మరోసారి 40 వేల మార్క్ను దాటి పైకి కదిలాయి కొత్త కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 41,195 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో 490 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో 39,069 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది.…
కరోనా టీకా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సినేషన్ సైతం యుద్ద ప్రాతిపధికన సాగుతోంది. అయితే, కొన్ని దేశాల్లో చిన్నపిల్లలకు కూడా టీకా ఇస్తున్నారు. భారత్లో ఎప్పుడెపుడు పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు తల్లిదండ్రులు. పెద్దలకు టీకా అందింది కానీ పిల్లలకు ఇప్పటి వరకు టీకా ఇవ్వట్లేదు. మరోపక్క స్కూళ్లు, కాలేజీలకు పంపలేని పరిస్థితి కరోనా సెకండ్వేవ్తగ్గినట్లే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం కావటం లేదు. ఇప్పటివరకు…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. మరోవైపు.. ఇప్పటికే థర్డ్ వేవ్ మొదలైపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.. అయితే, థర్డ్ వేవ్లో ఎక్కువ మంది చిన్నారులు కరోనాబారిన పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా సాగుతోంది.. ఈ తరుణంలో.. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది.. గడిచిన 5 రోజుల వ్యవధిలోనే ఏకంగా 242 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరంతా 19 ఏళ్లలోపు వారేనని అధికారులు…