ఏపీలో కరోనా ఉధృతి మళ్లీ మొదలైందా..? అదే కొంపముంచిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయా? అంటే కొన్ని ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.. సిక్కోలులో పాజిటివిటీ రేటు మళ్లీ పెరుగుతుండటంతో అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందనుకుంటున్న వేళ కేసులు పెరగడం శ్రీకాకుళం జిల్లాలో కొత్త కలవరాన్ని పుట్టిస్తోంది. సరిగ్గా 4నెలల క్రితం రాష్ట్రంలోనే అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో ఒకటిగా ఉన్న శ్రీకాకుళం.. ఆ తర్వాత కఠినమైన లాక్డౌన్ నిబంధనలతో వైరస్ను నిలువరించింది. అయితే, మొన్నటి వరకూ కొనసాగిన సండే లాక్డౌన్ కూడా.. ఎత్తేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చినట్టు కనిపిస్తోంది.
ఒక్కోరోజు జిల్లాలో 50 లోపు కేసులు నమోదైతే.. మరో రోజు దాదాపు 100 వరకూ కేసులు నమోదవుతున్నాయి. రూరల్, అర్బన్ అని తేడా లేకుండా రోజుకో ప్రాంతంలో రోజుకో మాదిరిగా పాజిటివిటీ రేటు నమోదవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో టెస్టులను పెంచి వైరస్ వాహకులను వేగంగా గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో కొవిడ్ పంజా విసురుతోంది. ఇంకా జిల్లాలో 2,778 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా.. ఇక్కడ 1800 మంది కరోనాకు బలయ్యారు. జిల్లాలో రోజుకు మూడు వందలకు పైగా కేసులు నమోదవడంతో పాటు.. మరణాలు కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి. తిరుపతి కేంద్రంగా ఎక్కువ నమోదు అవుతున్నాయి. కొన్ని మండలాల్లో ఐదు శాతానికి మించి పాజిటివిటీ రేటు నమోదవడం భయపెడుతోంది. మరో 22 మండలాల్లో సైతం రెండు శాతానికి మించి కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు అధికారులు. నెల రోజుల వ్యవధిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 60 మందికిపైగా పిల్లలు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. సైలెంట్ గా కేసులు పెరుగుతున్నా.. రాష్ట్రంలో అత్యధిక మరణాలు జిల్లాలోనే నమోదువుతున్నా… అదే స్ధాయిలో తోంబైశాతం మంది రికవరీ అవుతుండటం ఊరటనిస్తోంది. మునుపటిలా బెడ్లకు డిమాండు లేదు.. కొరత కూడా లేదు. అయితే, తాజాగా నమోదవుతున్న కేసులన్నీ.. ఎక్కువగా గ్రామాల్లోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.
Also Read
- AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
- Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
- AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
- MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
తాజావార్తలు
-
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
-
AP Liquor Scam: లిక్కర్ కేసులో అరెస్ట్లపై ఈడీ కీలక ప్రకటన.. రూ.195.33 కోట్ల నష్టం..!
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!