తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో సాధారణ జీవనం ప్రారంభం అయింది. ఇక ఇదిలా ఉంటే, రాష్ట్రంలో కొత్తగా 453 కరోనా కేసులు నమోదైనట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,51,288కి చేరింది. ఇందులో 6,39,456 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,137 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ముగ్గురు మృతి చెందినట్టు బులిటెన్లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 3,836 మంది కరోనాతో మృతి చెందారు.
Read: అల్లరి నరేశ్ ‘సభకు నమస్కారం’ ప్రారంభం