China: భారత స్నేహం కోసం చైనా ఆరాటం.. వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ చైనా, భారత స్నేహాన్ని కోరుకుంటోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. భారత్, చైనాలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూసుకోవాలని అన్నారు. చైనా, భారత్లు రెండు ‘‘గ్లోబల్ సౌత్’’లో భాగమని, లోతైన సాంస్కృతిక సంబంధాలు, విస్తృత ఉమ్మడి ప్రయోజనాలను పంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజింగ్లో జరిగిన 14వ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ సెషన్ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
చైనా, భారత్ మధ్య పరస్పర విశ్వాసం, సహకారం భాగస్వామ్య అభివృద్ధికి అత్యంత సానుకూలంగా ఉన్నాయని, అయిత విభజన, ఘర్షణ ఆసియా ఆసియా పునరుజ్జీవనానికి విరుద్ధం అని అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయని చెప్పారు. దీంతో రెండు దేశాల మధ్య సహకారం కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.
Also Read
- Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
- Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్పై అమిత్ షా ఫైర్
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
Read Also:Nishant Kumar: జేడీయూలో చేరిన సీఎం నితీష్ కుమార్ తనయుడు..
గత ఏడాది ఆగస్టులో టియాంజిన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జి జిన్పింగ్ సమావేశమయ్యారని వాంగ్ యి గుర్తు చేసుకున్నారు. కజాన్ తర్వాత జరిగిన ఈ సమావేశం భారత్-చైనా సంబంధాలను మరింత బలోపేతం చేసిందని, రెండు దేశాల నాయకుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం క్షేత్రస్థాయిలో అమలు చేయబడుతోందని, వాణిజ్యం గరిష్ట స్థాయికి చేరుకుందని అన్నారు.
బ్రిక్స్ వేదికలో భారత్, చైనాలు కలిసి పనిచేయాలని వాంగ్ యీ చెప్పారు. ఈ ఏడాది బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తోంది. వచ్చే ఏడాది చైనా ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, కొన్ని ఏళ్లుగా చైనా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. యూఎస్ ఆంక్షలు కూడా చైనాలో ఆందోళన పెంచుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ యుద్ధం కూడా చైనా ఎకానమీని ప్రభావితం చేస్తుంది. దీంతో భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చైనా ఆరాట పడుతోంది.
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!