దేశంలో కరోనా కేసులు అంతకంతకు భారీగా పెరుగుతున్నాయి. 20 నుంచి 30 శాతం మేర కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఒమిక్రాన్ కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. థర్డ్ వేవ్ వచ్చినా ఇబ్బందులు లేకుండా మందులు, ఆసుపత్రులు, ఆక్సీజన్ను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే దాని ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, వైద్యరంగంపై పెనుభారం పడుతుందని,…
దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, అమలు చేస్తున్నారు. పాజిటివిటి రేటు పెరుగుతుండటంతో ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విద్యాసంస్థలను మూసివేశారు. సినిమా హాళ్లు బంద్ చేశారు. ఇక 50 శాతం సీటింగ్లో రెస్టారెంట్లు, మెట్రోలు నడుస్తున్నాయి. కార్యాలయాలు సైతం 50 శాతం మంది ఉద్యోగులతోనే నడుస్తున్నాయి. మిగతా రాష్ట్రాల కంటే ఢిల్లీలో వేగంగా కేసులు పెరుగుతుండటంతో కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలను కఠినం చేసేందుకు…
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు గోవాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. గోవా పర్యాటక రాష్ట్రం కావడంతో అక్కడ సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అయితే, గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పీడిస్తుండటంతో వేడుకలకు దూరంగా ఉన్నారు. డిసెంబర్లో ఒమిక్రాన్ వేరియంట్, కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలు వాటిని పట్టించుకోకుండా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు పెద్ద ఎత్తున గోవా చేరుకొని సెలబ్రేట్ చేసుకున్నారు. వరసగా సెలవులు రావడంతో టూరిస్టులు పోటెత్తారు.…
భారత్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు తీవ్రస్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా భారత్లో 33,750 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నారని, నిన్న ఒక్కరోజులో 10,846 మంది కోలుకున్నట్టు బులిటెన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 123 మంది మృతి చెందారు. దీంతో భారత్లో ఇప్పటి వరకు కరోనాతో మృతి…
బీహార్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పాట్నాలోని నలందా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో పనిచేస్తున్న 87 మంది వైద్యులకు కరోనా సోకింది. కరోనా సోకివ వైద్యలుకు లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని, వారంతా ఆసుపత్రి క్యాంపస్లోనే ఐసోలేషన్లో ఉన్నట్టు పాట్నా డిస్టిక్ మెడికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవలే పాట్నాలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు. ఇందులో నలందా మెడికల్ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు. Read:…
జనవరి 1 వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎగ్జిబిషన్కు ఎలా అనుమతులు ఇస్తారని అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ప్రతిరోజూ లక్షలాది మంది నుమాయిష్ను చూసేందుకు వస్తారని, కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎగ్జిబిషన్ను నిర్వహిస్తే వైరస్ మరింత తీవ్రంగా వ్యాపించే అవకాశం ఉంటుందని అనేక మంది ఫిర్యాదులు చేశారు. బహిరంగ సభలు, ర్యాలీలపై ఇప్పటికే ప్రభుత్వం…
దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్రాలో నైట్ కర్ఫ్యూతో పాటు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక తాజాగా, పశ్చిమ బెంగాల్లోనూ కఠినమైన ఆంక్షలు అమలుకాబోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా నేటి నుంచి విద్యాసంస్థలు, పార్కులు, జిమ్ లు, సెలూన్లు, బ్యూటీపార్లర్లు మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 50 శాతం ఉద్యోగులతోనే కార్యాలయాలు నడవబోతున్నాయి. లోకల్ రైళ్లు సైతం 50 శాతం సీటింగ్తోనే నడుస్తాయి. Read:…
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుండటంతో కీలక బెంగళూరు నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మాల్స్, థియేటర్లలో ప్రవేశానికి రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఇదే విధానాన్ని పబ్లు, రెస్టారెంట్లతో పాటుగా క్యాబ్లకు కూడా విస్తరింపజేయాలని బెంగళూరు నగరపాలక సంస్థ చూస్తున్నది. రాబోయే రోజుల్లో కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోనున్నది. ప్రస్తుతం అందరివద్ద స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Read: కరోనా వేళ…
కరోనా మహమ్మారి ఢిల్లీలో పెద్ద ఎత్తున విజృంభిస్తోంది. ఆర్ ఫ్యాక్టర్ ఇప్పటికే 2 గా నమోదంది. ఆర్ ఫ్యాక్టర్ 1 ఉంటేనే వైరస్ తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు రాష్ట్రప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని, కానీ ప్రజలెవరూ ప్యానిక్ కావొద్దని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6360 యాక్టీవ్ కేసులు ఉన్నాయని, ఈరోజు 3100 కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని…
ఆదివారం కావడం వలన విశాఖలోని నాన్ వెజ్ మార్కెట్లు, దుకాణాలు కితకితలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో నాన్ వెజ్ మార్కెట్లకు ఎలా వెళ్లినా పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ, ప్రస్తుతం దేశంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఆంక్షలు జారీ చేస్తున్నా అవి…