ఒమిక్రాన్ విజృంభిస్తే… ఆ ప్రమాదం తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు అంతకంతకు భారీగా పెరుగుతున్నాయి. 20 నుంచి 30 శాతం మేర కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. ఒమిక్రాన్ కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. థర్డ్ వేవ్ వచ్చినా ఇబ్బందులు లేకుండా మందులు, ఆసుపత్రులు, ఆక్సీజన్ను అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే దాని ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుందని, వైద్యరంగంపై పెనుభారం పడుతుందని, ఫలితంగా ఆ రంగం ఇబ్బందుల్లో పడిపోతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఈరోజు నుంచి దేశంలో 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు వ్యాక్సిన్ అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
Read: కిమ్ మరో కీలక నిర్ణయం: గ్రామీణాభివృద్ధి, ఆహారంపై ప్రత్యేక దృష్టి…
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే మూడో వేవ్ సంకేతాలు దేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు రోజురోజుకు పెరుగుతున్నది. వారం రోజుల క్రితం 0.5 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు, ఇప్పుడు 4.59 శాతానికి చేరుకుంది. ఇది 5 శాతానికి చేరితే రెడ్ అలర్ట్ ప్రకటించక తప్పదు. టోటల్గా కర్ఫ్యూ విధించాల్సి రావొచ్చు. ఢిల్లీతో పాటు ముంబై నగరంలోనూ పాజిటివిటీ రేటు పెరుగుతున్నది. ఒమిక్రాన్ కేసులు కూడా ముంబై నగరంలోనే అధికసంఖ్యలో ఉన్నాయి. ముంబైలో మొత్తం 510 ఒమిక్రాన్ కేసులుండగా, ఢిల్లీలో 351 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇక దేశం మొత్తం మీద 1700 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడానికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణం కావడంతో అన్ని రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
- Tags
- corona
- corona Cases
- Health
- india
- Omicron
తాజావార్తలు
-
Student Protest: నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్..
-
Shreyas Iyer Record: ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు.. ప్రపంచంలోనే తొలి కెప్టెన్గా శ్రేయస్ సరికొత్త చరిత్ర!
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!