మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది.. దేశవ్యాప్తంగా కొత్త రికార్డుల వైపు కోవిడ్ కేసులు పరుగులు పెడుతున్నాయి.. మరోవైపు తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది.. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.. రేపటి నుంచి రాష్ట్రంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి హరీష్రావు.. ప్రజలకు అందుబాటులో మందులు ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన ఆయన.. ఫీవర్ సర్వేలో కరోనా లక్షణాలున్నవారికి మెడికల్ కిట్ అందజేయనున్నట్టు తెలిపారు.. హోం ఐసొలేషన్ కిట్లు, టెస్టింగ్ కిట్లు,…
యూపీలో ఫిబ్రవరి నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడు విడతల ఎన్నికల కోసం యూపీ అధికారులు సిద్దం అవుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ను వేగంగా అమలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం అధికారులు పల్లె ప్రాంతాలకు వెళ్లి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, బలియా జిల్లాలో అత్యల్పంగా వ్యాక్సినేషన్ జరిగింది. అక్కడి ప్రజలు వ్యాక్సిన్ను తీసుకోవడానికి ససేమిరా అంటున్నారు. దీంతో అధికారులు బతిమాలి, వ్యాక్సిన్పై అవగాహన కల్పిస్తూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే,…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్ను అందిస్తున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నది. ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ, తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి కాస్త తక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత అధికంగా ఉండటంతో మరణాల సంఖ్య అధికంగా ఉన్నది. గతంలో మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకుతున్నట్టుగా నిర్ధారణ జరిగిన సంగతి తెలిసిందే. డెల్టా వేవ్ సమయంలో…
కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు టీకాలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున టీకాలు అందిస్తున్నారు. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో టీకాలు అందిస్తున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్, హెల్త్కేర్ వర్కర్లు, కరోనా వారియర్స్కు టీకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు అత్యవసర వినియోగం కింద అనుమతులు పొందిన కోవీషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు త్వరలో బహిరంగ మార్కెట్లోకి రాబోతున్నాయి. కోవీషీల్డ్, కోవాగ్జిన్ తయారీ సంస్థలు బహిరంగ…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా వేదికగా అభిమానులకు తెలియజేసింది. ” అన్ని జాగ్రత్తలు తీసుకున్నపటికీ అన్ని లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నాను. దయచేసి ఇటీవల కాలంలో నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా చెప్తున్నాను దయచేసి అందరు మాస్కులు ధరించండి.. అవసరమైతే తప్ప బయటికి…
కేరళలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 34,199 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 8,193 మంది కరోనా నుంచి కోలుకోగా, 49 మంది మృతి చెందారు. కేరళలో ఇప్పటి వరకు 51,160 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1,68,383 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు కేరళ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మొదటి వేవ్ను కేరళ సమర్థవంతంగా ఎదుర్కొనగా, రెండో వేవ్లో అత్యధిక కేసులతో పాటు మరణాలు…
ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ సివియర్ కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో అనేక దేశాలు ఒమిక్రాన్ ను లైట్గా తీసుకుంటున్నాయి. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ కీలక హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు తక్కువగా ఉంటాయని, తీవ్రత తక్కువగా ఉందని తక్కువ చేసి చూడడం పొరపాటే అవుతుందని, ఒమిక్రాన్ వేరియంట్ ఎలా విరుచుకు పడుతుంతో ఇప్పుడే అంచనా వేయలేమని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. సార్స్ కోవ్ 2 వైరస్ను…
ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో 10,057 కరోనా కేసులు నమోదైనట్టు ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 8 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,27,441కి చేరింది. ఇందులో 20,67,984 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 44,935 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం…
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయానా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానసర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 28 వరకు ఆంక్షలను పొడిగించారు. ప్రస్తుతం జనవరి 31 వరకు నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో డీజీసీఏ ఆంక్షలను మరోసారి పొడిగించాలని నిర్ణయించింది. ఒమిక్రాన్కు ముందు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో డిసెంబర్ 15 నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ…
కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తోన్న తరుణంలో.. కోవిడ్ టెస్ట్ల సంఖ్య తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది కేంద్రం.. ఇప్పటికే కోవిడ్ టెస్ట్ల సంఖ్య పెంచాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు వెళ్లాయి.. అయితే, రాష్ట్రంలోని అన్ని ఏఎన్ఎం, పీహెచ్సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు మంత్రి హరీష్రావు.. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఆసుపత్రిలో…