పంజాబ్ పిసిసి అధ్యక్షుడుగా నవజోత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే… నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా నియమించింది ఏఐసిసి అధిష్ఠానం. వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా సంగత్ సింగ్ గిలిజియన్, సుఖవీందర్ సింగ్ డానీ, పవన్ గోయల్, కుల్జీత్ సింగ్ నగ్రా లను నియామకం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు నియామకాలను ఆమోదిస్తూ ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
రేపటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈరోజు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ముందే అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంటరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. మాజీ కేంద్రమంత్రులు పి చిదంబరం, మనీశ్ తివారీ, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్ వంటి వారికి స్థానం కల్పించారు. లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా పనిచేసేందుకు ఈ గ్రూపులను ఏర్పాటు…
కాంగ్రెస్ నేత మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ నిన్నా..మొన్న పుట్టిందని… నడకలు కూడా ఆమెకు రాలేదని తెలిపారు. అప్పుడే పరుగులు పెడతా అంటే ప్రకృతికి విరుద్ధమని… పురుడు పోసుకున్నది మొన్ననేనని చురకలు అంటించారు. 9 నెలలు అయితే.. అడుగులు నేర్చుకోవచ్చన్నారు. ఆమె పై అంతకు మించి మాట్లాడేది ఏముండదని… కాంగ్రెస్ నాయకుడిగా వైఎస్ ని గౌరవిస్తామని తెలిపారు. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి అంటే కొంత గౌరవం ఉండేదని…కానీ నిస్సిగ్గుగా మాట్లాడారని మండిపడ్డారు. read…
మంత్రి పదవి ముగిసి ఏడేళ్లయినా ఇంకా అదే ఫీలింగ్లో ఉన్నారట ఆ నాయకుడు. బలహీనమైన ప్రత్యర్థుల చేతిలో వరసగా రెండుసార్లు ఓడినా తత్వం బోధపడలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు సొంత పార్టీలో కీలక పదవులు దక్కినా ఆయనకు జ్ఞానోదయం కావడం లేదట. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారట ఆ మాజీ అమాత్యుల వారు. ఇంతకీ ఎవరా నాయకుడు? రాష్ట్రస్థాయి నేతగా చాలా పనులు ఉంటాయని చెబుతారు! దామోదర రాజనర్సింహ. ఉమ్మడి రాష్ట్రానికి…
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు నేషనల్ వైడ్ గా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా సోనియా గాంధీ కుటుంబంతో మంగళవారం సమావేశమయ్యారు. అయితే ఈ మీటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించినట్లు అంత అనుకున్నారు. కాగా, తాజా సమాచారం మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి వస్తే సరైన గుర్తింపు..…
పీసీసీకి కొత్త నాయకత్వం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నాయి శ్రేణులు. కానీ.. ఆ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇంఛార్జ్ పదవిపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదు. కిందస్థాయి ప్రజాప్రతినిధులు చేజారిపోతున్నా పట్టించుకోవడం లేదట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? మేడ్చల్ కాంగ్రెస్లో గ్రూపులదే రాజ్యం! అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేడ్చల్ జిల్లా కాంగ్రెస్లో గ్రూపులు ఎక్కువయ్యాయి. ఏ ఎన్నిక జరిగిన తమ వారికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానం మీద…
ఆడియో టేపు లీక్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుజురాబాద్ నేత కౌశిక్రెడ్డికి మరో షాక్ తగిలింది… టీపీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డిని నియమించేందుకు రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కౌశిక్రెడ్డి ఆరోపణలు చేయడంపై సీరియస్గా స్పందించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్… పాడి కౌశిక్రెడ్డికి లీగల్నోటీసులు పంపారు.. కౌశిక్కు మదురై కోర్టు నుంచి ఈ లీగల్నోటీసు జారీ అయ్యాయి… దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొనగా… లేకపోతే…
హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతోందని.. ఎమ్మెల్యేలు, మంత్రులు, వంద మంది సీఎంలు వచ్చినా ఈటల గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు రఘునందన్ రావు. 14 ఏళ్ల ఉద్యమ పార్టీ.. ఏడేళ్ల అధికార పార్టీ.. ఒక్క బీసీ నాయకుని తయారు చేసుకోలేక పోయిందని చురకలు అంటించారు. గతంలో దుబ్బాకలో లక్ష మెజారిటీతో గెలిచినట్టు… హుజురాబాద్ మాదే అని ప్రకటనలిస్తున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని నోట్ల కట్టలు వెదజల్లినా ఎవరికి పట్టం…
కౌశిక్ రెడ్డి రాజీనామాపై మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. కౌశిక్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నానని.. కాంగ్రెస్ లో 2018 లో హుజురాబాద్ టికెట్ రావడం వల్లనే కౌశిక్ రెడ్డి లీడర్ అయ్యాడన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీని.. పార్టీలోని నాయకులను విమర్శించడం సిగ్గుచేటు తెలిపారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మనిక్కమ్ ఠాగూర్ లపై కౌశిక్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు. read also :…
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. గతంలో ఆ నియోవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించింది కాంగ్రెస్ పార్టీ… అధికార టీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై.. పార్టీకి ద్రోహం చేస్తున్నాడంటూ.. కౌశిక్రెడ్డిపై వేటు వేసింది పీసీసీ… టీఆర్ఎస్ తో కుమ్మక్కై కౌశిక్రెడ్డి.. కోవర్టుగా మారి.. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్నందుకు బహిష్కరణ వేటు వేసినట్టు ప్రకటించారు…