మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ తర్జన భర్జన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్న ఈటల.. వచ్చేవారం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక, ఇదే ఊపులో మరిన్ని చేరికలు బీజేపీ తెరలేపుతోంది.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి.. ఏ పార్టీలో చేరలేదు.. ఏ పార్టీలో చేరాలన్నదానిపై కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటానని తన రాజీనామా సందర్భంగా వెల్లడించారు.…
ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీ జరిగింది. వర్చువల్ విధానం ద్వారా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలపై సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధినేత్రి సోనియా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల పనితీరుపై ఆమె మండిపడ్డారు. అదే విధంగా ఈ సమావేశంలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, వ్యాక్సిన్, లాక్ డౌన్ తదితర అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఈనెల 15 వ తేదీన సబ్బం హరి కరోనా బారిన పడ్డారు. మూడోరోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తరువాత వైద్యుల సలహామేరకు ఆయన విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. జూన్ 1, 1952 లో జన్మించిన సబ్బం హరి 1995 లో విశాఖపట్నానికి మేయర్…