టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ని కత్తి కార్తీక కలిశారు. ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా మధుయాష్కీకి శుభాకాంక్షలు తెలిపారు కత్తి కార్తీక. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈ సందర్భంగా కత్తి కార్తీకను ఆహ్వానించారు మధుయాష్కీ. అయితే.. ఈ ఆఫర్ పై
కత్తి కార్తీక సుముఖత వ్యక్తం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అటు ఈ అంశంపై రేవంత్ రెడ్డితో మధుయాష్కీ చర్చించినట్లు సమాచారం. బీసీ మహిళ, తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలైన కత్తి కార్తీకను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని రేవంత్ అన్నట్లు సమాచారం అందుతోంది. కాగా.. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో కత్తి కార్తీక పోటీ చేసిన సంగతి తెలిసిందే.