కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం: పార్లమెంటరీ గ్రూపులు ఏర్పాటు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈరోజు సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి ముందే అధినేత్రి సోనియా గాంధీ పార్లమెంటరీ గ్రూపులను ఏర్పాటు చేశారు. మాజీ కేంద్రమంత్రులు పి చిదంబరం, మనీశ్ తివారీ, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్ వంటి వారికి స్థానం కల్పించారు. లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సమర్ధవంతంగా పనిచేసేందుకు ఈ గ్రూపులను ఏర్పాటు చేసినట్టు సోనియా గాంధీ పేర్కొన్నారు.
Read: ఉపాసన సోదరి నిశ్చితార్థం!
Also Read
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ఈ గ్రూపులు ప్రతిరోజూ సమావేశమవుతాయని, పార్లమెంట్లో ప్రస్తావించే సమస్యలకు సంబందించి అవసరమైనపుడు ఇంటర్ సెషన్ పీరియడ్స్లో కూడా సమావేశం కావోచ్చని సోనియాగాంధీ పేర్కొన్నారు. లోక్సభ కాంగ్రెస్ పక్షనేతను మారుస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ క్లారిటీ ఇచ్చింది. కాంగ్రెస్ పక్షనేతగా బెంగాల్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరినే కొనసాగుతారని స్పష్టం చేశారు. శశిథరూర్, గౌరవ్ గొగోయ్, కే సురేష్, రవనీత్ సింగ్ బిట్టు, మాణిక్యం ఠాగూర్లకు ఈ గ్రూపులో స్థానం కల్పించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేతగా మల్లిఖార్జున ఖర్గే కొనసాగుతారని పార్టీ స్పష్టం చేసింది. ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటరీ గ్రూపులు సమావేశాలు నిర్వహిస్తాయి. అవసరమైనపుడు ఈ గ్రూపులు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉన్నది. ఉమ్మడి సమావేశం నిర్వహించినపుడు మల్లిఖార్జున ఖర్గే కన్వీనర్గా వ్యవహరిస్తారు.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..