Montha Cyclone: ‘మొంథా’ తుఫాన్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుండి అధికారులతో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఐదుగురు లేదా ఆరుగురు సభ్యులతో కూడిన ప్రభుత్వ బృందాలను తక్షణమే గ్రామాలకే పంపించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.…
వైద్య విద్యార్థిని అత్యాచారం కేసులో ప్రియుడే సూత్రధారి.. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో వైద్య విద్యార్థిపై సామూహిక అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న, ఒడిశాకు చెందిన అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందిగుడిని ఫిర్దౌస్ షేక్గా గుర్తించారు. మరో ఐదుగురిని సహ నిందితులుగా పేర్కొన్నారు. సహ నిందితుల్లో బాధితురాలి ప్రియుడు అయిన సహ విద్యార్థి కూడా ఉండటం గమనార్హం. బాధితురాలి న్యాయవాది…
శ్రేయస్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన సూర్యకుమార్.. ఏం చెప్పాడంటే?! సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో తీవ్ర గాయానికి గురైయ్యాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. శ్రేయస్ ఆరోగ్యం గురించి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ బాగానే ఉన్నాడని, వైద్యులు నిత్యం అతన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పాడు. ఇది మనకు శుభవార్త…
Cyclone Montha: మొంథా తుఫాన్పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. కీలక ఆదేశాలు జారీ చే శారు.. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి, నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇంఛార్జ్లను నియమించాలి.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ చేయాలి..…
Shyamala: ఆంధ్రప్రదేశ్లో ‘బాబు గారి మాటలకు అర్థాలే వేరులే’ అనే కొత్త సినిమా విడుదలైంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల సెటైర్లు వేశారు.. ఎన్నికల ముందు బాబు గారు ఒక మాట మాట్లాడారు అంటే చాలా అర్థాలు ఉంటాయి.. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేశారు.. మద్యం మాఫియాతో అనాగరిక పాలన సాగుతోంది.. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు అనేకం పుట్టుకొస్తున్నాయి.. రాష్ట్రంలో అర్ధరాత్రి సమయంలో కూడా మద్యం దొరుకుతుంది.. మద్యం…
నేడు వెల్దుర్తికి సీఎం చంద్రబాబు.. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి కొడుకు గౌతంరెడ్డి వివాహ రిసెప్షన్లో పాల్గొనున్న సీఎం చంద్రబాబు మొంథా తుఫాన్ హెచ్చరికలతో పర్యాటక కేంద్రాలు క్లోజ్.. కైలాసగిరి సహా బీచ్ రోడ్డులో ఉన్న సందర్శన స్థలాల మూసివేతకు VMRDA నిర్ణయం.. నేడు, రేపు కైలాసగిరిపై కేబుల్ కార్, అడ్వెంచర్ స్పోర్ట్స్ నిలిపివేయాలని ఆదేశం నేటి నుంచి మూడు రోజుల పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు.. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విద్యా సంస్థలకు…
హమ్మయ్య ఛేదించారు.. 19వ మృతదేహం అతడిదే..! కర్నూలు నగర సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్ బస్ ఫైర్ యాక్సిడెంట్ లో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే 18 మంది ప్రయాణికుల మృతదేహాలు సంబంధించిన వివరాలను పోలీసులు కనుగొన్నారు. కాకపోతే మరో మృతదేహానికి సంబంధించిన వివరాలను పోలీసులు చేదించలేకపోయారు. అయితే తాజాగా ఈ డెడ్ బాడీకి సంబంధించిన వివరాలను పోలీసులు ప్రకటించారు. ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిదంటే.. ఈ ఘటనలో…
ఏపీకి హైఅలర్ట్.. రాబోయే మూడు రోజులు ఎక్కడికి వెళ్లొద్దు.. మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ…
8 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపిన హైడ్రా హైదరాబాద్లోని పోచారంలో 1978లో 27 ఎకరాల భూమి మీద 400 ప్లాట్లతో ఏర్పాటు చేసిన జీపీ లే అవుట్లో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఈ లే అవుట్లో ఒక వ్యక్తి 6.18 ఎకరాల భూమిని తనదేంటూ అక్రమంగా ప్రహరీ నిర్మించినట్టు సొసైటీ సభ్యులు వాదించారు. ఈ వ్యవహారం సుమారు 8 ఏళ్లుగా కొనసాగుతూ, సొసైటీ సభ్యులు అనేక మార్ల ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో భాగంగా మూడవ రోజు యూఏఈ ఆర్థిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో యూఏఈ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వాణిజ్య బంధాన్ని మరింత పెంపొందించుకునే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. ప్రస్తుతం భారత్, యూఏఈ దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతపై నేతలు ప్రధానంగా చర్చించారు. పాలన, పౌర సేవలను మరింత మెరుగ్గా…