CM Chandrababu: చాయ్వాలా దేశానికి ప్రధాని కావడం అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం..
- రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యత.. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి..
- ఒక చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యాడు, సాధారణ వ్యక్తి అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు..
- గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయ్యారంటే రాజ్యాంగ గొప్పతనం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఏపీ అసెంబ్లీ ఆవరణలో జరిగిన మాక్ అసెంబ్లీకి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో విద్యార్థులు పెర్ఫామెన్స్ బాగుంది.. రాజ్యాంగ దినోత్సవం ఒక బాధ్యత.. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి.. మంత్రి లోకేష్ కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పుస్తకం తెచ్చారు.. ఈ పుస్తకం లో అనేక మంచి విషయాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక చాయ్వాలా దేశానికి ప్రధాని అయి, దేశ దిశ మార్చారంటే అది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం.. సాధారణ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు.. భారత రత్న పొందారు.. పవర్ ఫుల్ రాష్ట్రపతిగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read
- CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
- CM Chandrababu : ఎన్టీఆర్కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
- Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
- Motkupalli Narasimhulu: ఎన్టీఆర్ను గుర్తుచేసుకుంటూ మోత్కుపల్లి భావోద్వేగం.. “మనసున్న నాయకుడిని మళ్లీ చూడలేం”
ఇక, ద్రౌపది ముర్ము గిరిజన మహిళ ప్రస్తుతం రాష్ట్రపతి అయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. నేను కూడా సాధారణ కుటుంబంలో పుట్టి నాలుగవ సారి సీఎం అయ్యానంటే అది రాజ్యాంగం కల్పించిన అవకాశం అని చెప్పాలి.. రాజ్యాంగం హక్కులే కాదు.. విధులు కూడా ఇచ్చింది.. చాలా మంది హక్కుల కోసం పోరాటం చేస్తారు.. కానీ విధులను గురించి పట్టించుకోరు.. దేశంలో ఏ ఒక్కరూ రాజ్యాంగం కంటే గొప్పవారు కాదు.. రాజ్యాంగ స్వరూపం చాలా గొప్పది.. పార్లమెంట్, శాసన సభలు చట్టాలు చేస్తాయి.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం సభకు రాకూడదు.. సమాజ హితం కోసం ప్రజాప్రతినిధులుగా రావాలని చంద్రబాబు కోరారు.
అయితే, వ్యక్తిగత కక్షల కోసం పోరాడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏ దేశానికైనా పబ్లిక్ పాలసీలు అవసరం.. 1990లో ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చాం.. ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాం.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాం.. నాలెడ్జ్ ఎకనామీలో తెచ్చిన ఒకే ఒక్క ఐటీ పాలసీ వల్ల తలసరి ఆదాయం పెరిగింది.. వందల దేశాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.. విదేశీయుల కంటే తలసరి ఆదాయం అధికంగా పొందుతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.
Read Also: Vikarabad: లక్కంటే వీళ్లదే..! గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ కుటుంబానికి జాక్పాట్..
కాగా, విద్యా, ఉద్యోగాల్లో 33 శాతం ఆడ పిల్లలకు రిజర్వేషన్లు తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మగవారికంటే ఆడపిల్లలు ఇప్పుడు ఎక్కువ జీతం సంపాదిస్తున్నారు.. ఆడ పిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి.. మహిళ పట్ల అవహేళనగా మాట్లాడితే ఎదుర్కోవాలి.. వెంటాడితే భయపడతారు.. ఆడ పిల్లలాగా ఏడుస్తున్నావు, గాజులు తోడుక్కుని లేమని అంటుంటారు.. ఇవన్నీ పోవాలని సూచించారు. ఆర్టీసీ కండక్టర్లుగా మహిళలకు అవకాశం కల్పించాం.. ఆకాశమే హద్దుగా ఆడ పిల్లలు ఎదగాలి అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Trinamool congress: బెంగాల్లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?
-
Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం
-
Dal Ki Dulhan : రొటీన్ గా రొట్టెలు తిని విసిగిపోయారా ? అయితే నోరూరించే నార్త్ స్పెషల్ ‘దాల్ కీ దుల్హన్’ ట్రై చేయండి.
-
Anushka Sharma: RCB ఫైనల్ చేరడంలో అనుష్క శర్మ పాత్ర కూడా.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటంటే..?
-
CM Chandrababu : విజయాలకు కారణమైన కార్యకర్తలకు శాశ్వతంగా రుణపడి ఉంటా
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!