Tirumala laddu controversy: లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదు..
- తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
- లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బ తీశారు..
- అధిక ధరలతో నెయ్యి కొనుగోలు చేశారన్న ఆరోపణలు నిజం కాదు..
- వైసీపీ హయాంలోనే కాదు.. అంతకుముందు కూడా కల్తీ జరిగిందా: వైవీ సుబ్బారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala laddu controversy: తిరుమల లడ్డూ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తోంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని సుప్రీం కోర్టులో నేను పిటీషన్ దాఖలు చేశాను.. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయి.. 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయ్యారయ్యాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అధిక ధరలతో నెయ్యిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు నిజం కాదు.. 2019 -2024 హయాంలోనే కల్తీ జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు.. అంతకు ముందు కూడా కల్తీ జరిగిందా..!? దర్యాప్తు జరగాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Mahindra XEV 9s: భారత మార్కెట్లోకి మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUV XEV 9S.. ధర ఎంతంటే..?
Also Read
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
అయితే, మా హయాంలో రూ.80 కోట్ల రూపాయలతో అత్యాధునిక సదుపాయాలతో “టెస్ట్ లాబ్” ఏర్పాటు చేశామని మాజీ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. 2019కి ముందు భక్తులు ఇచ్చిన దానాలు, టీటీడీ నిధులను సుమారు 1200 కోట్ల రూపాయలను ప్రైవేట్ “ఎస్” బ్లాంకులో డిపాజిట్ చేశారు.. మా హయాంలో ఆ నిధులను “విత్ డ్రా” చేసి ప్రభుత్వ బ్యాంకులో డిపాజిట్ చేశాం.. తద్వారా సుమారు 100 కోట్ల రూపాయలను “సేవ్” చేశామన్నారు. మేము విత్ డ్రా చేసిన తర్వాత, ఎస్ బ్యాంక్ దివాలా తీసింది.. మా హయాంలో కిలో నెయ్యిని 320 రూపాయలకు కొనుగోలు చేశాం కాబట్టి కల్తీ జరిగిందని అంటున్నారు..ఆ ఆరోపణలే నిజమైతే, అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా అంతకంటే తక్కువ ధరకే నెయ్యిని కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఇక, 2019కి ముందు కూడా కిలో నెయ్యిని 279, 295 రూపాయలకు కూడా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కాబట్టి, అప్పడు కూడా నెయ్యి కల్తీ జరిగిందని అనుకోవాలా..? అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!