Tirumala laddu controversy: లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదు..
- తిరుమల లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
- లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బ తీశారు..
- అధిక ధరలతో నెయ్యి కొనుగోలు చేశారన్న ఆరోపణలు నిజం కాదు..
- వైసీపీ హయాంలోనే కాదు.. అంతకుముందు కూడా కల్తీ జరిగిందా: వైవీ సుబ్బారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala laddu controversy: తిరుమల లడ్డూ వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తోంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని సుప్రీం కోర్టులో నేను పిటీషన్ దాఖలు చేశాను.. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయి.. 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయ్యారయ్యాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అధిక ధరలతో నెయ్యిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు నిజం కాదు.. 2019 -2024 హయాంలోనే కల్తీ జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు.. అంతకు ముందు కూడా కల్తీ జరిగిందా..!? దర్యాప్తు జరగాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: Mahindra XEV 9s: భారత మార్కెట్లోకి మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ SUV XEV 9S.. ధర ఎంతంటే..?
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
అయితే, మా హయాంలో రూ.80 కోట్ల రూపాయలతో అత్యాధునిక సదుపాయాలతో “టెస్ట్ లాబ్” ఏర్పాటు చేశామని మాజీ టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. 2019కి ముందు భక్తులు ఇచ్చిన దానాలు, టీటీడీ నిధులను సుమారు 1200 కోట్ల రూపాయలను ప్రైవేట్ “ఎస్” బ్లాంకులో డిపాజిట్ చేశారు.. మా హయాంలో ఆ నిధులను “విత్ డ్రా” చేసి ప్రభుత్వ బ్యాంకులో డిపాజిట్ చేశాం.. తద్వారా సుమారు 100 కోట్ల రూపాయలను “సేవ్” చేశామన్నారు. మేము విత్ డ్రా చేసిన తర్వాత, ఎస్ బ్యాంక్ దివాలా తీసింది.. మా హయాంలో కిలో నెయ్యిని 320 రూపాయలకు కొనుగోలు చేశాం కాబట్టి కల్తీ జరిగిందని అంటున్నారు..ఆ ఆరోపణలే నిజమైతే, అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా అంతకంటే తక్కువ ధరకే నెయ్యిని కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఇక, 2019కి ముందు కూడా కిలో నెయ్యిని 279, 295 రూపాయలకు కూడా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కాబట్టి, అప్పడు కూడా నెయ్యి కల్తీ జరిగిందని అనుకోవాలా..? అని వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!