ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుంది. తొలిసారి వైరస్ వెలుగు చూసిన చైనాలో మళ్లీ కేసులు పెరగడంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్తో ఆదేశంలో కేసులు పెరుగుతున్నాయి. 11కు పైగా ఫ్రావిన్స్లలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కేసులు కట్టడి చేస్తున్నా సమీప భవిష్యత్లో కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశముందని స్థానిక అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ అంటే మొదట గుర్తుకు వచ్చేది చైనానే. ప్రపంచాన్ని వణికించిన ఈ…
గత కొన్ని రోజులుగా హైపర్ సోనిక్ క్షిపణుల ప్రయోగాలకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రసారం అవుతున్నాయి. చైనా హైపర్ సోనిక్ క్షిపణిని ఆగస్టులో ప్రయోగించింది. ఈ ప్రయోగానికి సంబంధించిన సమాచారాన్ని ఆ దేశం రహస్యంగా ఉంచి, అక్టోబర్లో బహిర్గతం చేసింది. దీంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాడార్లకు అందకుండా భూమిచట్టూ ఈ క్షిపణి ప్రదక్షిణ చేసి టార్గెట్కు 30 కిలోమీటర్ల దూరంలో పడిండి. అయితే, రాడార్లకు అందకుండా ఈ హైపర్ సోనిక్ క్షిపణులు టార్గెట్ను ఛేదిస్తుంటాయి.…
కరోనా మహమ్మారి రూపం మార్చుకుంటూ యావత్ ప్రపంచ మానవాళి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. ధనిక, పేద దేశాలు అని తేడా లేకుండా అందరిమీద దాడి చేస్తూనే ఉంది.. జన్యుపరమైన మార్పులు చోటు చేసుకుంటూ ప్రజలను భయపెడుతోంది. ఇప్పుడు డెల్టా వేరియెంట్లోని ఏవై.4.2 రకం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తాజాగా కొత్త వేరియంట్ లక్షణాలు కనిపించినట్టు డాక్టర్లు ప్రకటించారు. యూకేలో కొత్త వేరియంట్ కేసులు ఆగడం లేదు. ఇటు, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్లో కూడా వెలుగు…
ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై హోం వర్క్ భారం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పిల్లలపై హోంవర్క్ భారం తగ్గించేందుకు చైనా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని కోసం కొత్త చట్టం తీసుకురావాలని యోచిస్తోంది. ఈ చట్టం ద్వారా తీసుకురాబోయే నిబంధనలను అమలు చేసే బాధ్యతను స్థానిక అధికార యంత్రాంగానికి అప్పగించాలని చైనా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పిల్లలకు హోంవర్క్ తగ్గించడమే కాకుండా పిల్లలకు సరిపడా విశ్రాంతి లభించేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని ఈ చట్టం ద్వారా…
గత కొంతకాలంగా చైనా, తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ తమ భూభాగంలో భాగమే అని, తప్పని సరిగా ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామని చైనా చెబుతూ వస్తున్నది. కొన్ని రోజులుగా తైవాన్ సరిహద్దు ప్రాంతంలో చైనా జెట్ విమానాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే చైనా ఆ దేశాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయితే, తైవాన్పై డ్రాగన్ దాడిచేస్తే తైవాన్కు అండగా పోరాటం చేస్తామని అమెరికా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ…
కరోనా మహమ్మారికి పుట్టినిల్లు ఏది అంటే అంతా చైనా పేరును చెబుతారు.. మొదట్లో ఆ ఆదేశాన్ని కలవరానికి గురిచేసిన కోవిడ్ 19.. అన్ని దేశాల్లో ఆందోళనకర పరిస్థితికి చేరుకునేసరికి.. అక్కడ మాత్రం ఏమీ లేకుండా పోయింది. అయితే, అప్పుడప్పుడు.. కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ డ్రాగన్ కంట్రీని షేక్ చేస్తూన్నాయి. ఇప్పటికే పలు దాపాలుగా చైనాను మహమ్మారి పలకరించిపోయింది.. తాజాగా.. మరోసారి కలవరం సృష్టిస్తోంది.. దీంతో, కట్టడి చర్యలకు దిగింది కమ్యూనిస్టు సర్కార్.. వందలాది విమాన సర్వీసులను…
దక్షిణ చైనా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక, రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదగాలని చైనా చూస్తున్నది. దీనికోసం చుట్టుపక్కల దేశాలను బెదిరిస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే హాంకాంగ్, టిబెట్పై ఆధిపత్యం చలాయిస్తున్న చైనా, తైవాన్ను ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే అమెరికా అధికారులు తెలిపారు. హిమాలయ సరిహద్దుల్లో చైనా దురాక్రమణలకు పాల్పడుతూనే ఉందని చైనాలో కొత్తగా నియమితులైన సీనియర్ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని వియాత్నం, ఫిలిప్పిన్స్తో పాటుగా జపాన్,…
చిన్నపిల్లలు అల్లరి చేయడం సహజం. అల్లరి చేసే సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. పిల్లల్ని చిన్నతనం నుంచే మంచి దారిలో పెట్టాలి. లేదంటే పెద్దయ్యాక దారితప్పుతారు. పిల్లలు తప్పులు చేసినా, మంచి విజయాలు సాధించినా ఆ క్రెడిట్ మొత్తం తల్లిదండ్రులకు దక్కుతుంది. ఇకపై ఆ దేశంలో పిల్లలు తప్పుచేస్తే దానిక బాధ్యతగా తల్లిదండ్రులకు శిక్ష విధిస్తారట. ఇలాంటి చట్టాన్ని అమలు చేస్తున్నది మరెవరో కాదు. చైనా. గత కొంతకాలంగా చైనాలో పిల్లలు ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడి…
జాతీయ భద్రత, పౌరుల వ్యక్తిగత గోప్యత కోసం కేంద్ర ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. అందులో వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్ కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీలు తయారుచేసే స్మార్ట్ ఫోన్లలో వాడే వివిధ సాంకేతిక అంశాలను తెలియచేయాలని కేంద్రం నోటీసులిచ్చింది. ఫోన్లలో వాడే హార్ట్ వేర్, సాఫ్ట్ వేర్ వివరాలు, ప్రీ ఇన్స్టాల్ యాప్స్,…
శీతాకాలం ఆరంభానికి ముందే హిమాచల్ ప్రదేశ్, హిమాలయ ప్రాంతాల్లో మంచు కురుస్తున్నది. మంచుదుప్పట్లు కప్పేయడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఇండియా చైనా బోర్డర్లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ కి పడిపోతాయి. అలాంటి సమయంలో అక్కడ పహారా నిర్వహించడం అంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఎంతటి కఠినమైన, దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకొని భారత సైనికులు కాపలా కాస్తుంటారు. అయితే, ఇటీవలే ఇండియా చైనా దేశాల మధ్య 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి…