కరోనాతో వణుకుతున్న చైనా.. ప్రయాణాలు వద్దని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్ కి పుట్టినిల్లయిన చైనాలో మళ్ళీ ఆ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. మిగతా దేశాల్లో ఆంక్షలు సడలించి అన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నాయి. కానీ, చైనాలో మాత్రం మళ్ళీ వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళినవారు తిరిగి వస్తే ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలంటున్నారు. వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వైద్య అధికారులు ఆదేశించారు. కొవిడ్ కేసులను సున్నా స్థాయికి పరిమితం చేసేందుకు ఈ మేరకు చర్యలు చేపట్టామని, అంతా నిబంధనలు పాటించాలని కోరుతున్నారు.
ఈమేరకు బీజింగ్ హెల్త్ కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది. బీజింగ్ దాటి బయటకు వెళ్ళినవారు వైరస్ కేసులు వెలుగు చూసినట్లైతే.. తిరిగి నగరానికి రావద్దు. పర్యటనలు పూర్తి చేసుకుని ఇప్పటికే చేరుకున్నవారు.. స్థానిక అధికారులకు తెలియజేయాలి, స్వీయ నిర్బంధంలో ఉండాలి.
Also Read
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్ను సందర్శించే అవకాశం
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Tarique Rahman: నవంబర్లో భారత్కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
వైద్యసాయం పొందాలని సూచించింది. ప్రజల ప్రయాణ రికార్డులను పరిశీలించేందుకు ఇంటింటికి వెళ్లి ఆరోగ్య అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. గత నెలలో చైనాలో 20 కరోనా కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. బీజింగ్లో తాజాగా కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇవి స్థానికంగా వ్యాప్తి చెందిన కేసులుగా గుర్తించారు.
మరోవైపు, నవంబరు 8 నుంచి 11 మధ్య చైనా అధికార పార్టీ- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా బీజింగ్ నగరంలో ఓ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 375 మందికిపైగా అధికారులు పాల్గొననున్నారు. 2022 ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్ కూడా బీజింగ్లో జరగనున్నాయి. వందలాది మంది అంతర్జాతీయ క్రీడాకారులు ఈ పోటీలకు హాజరవనున్నారు.
దీంతో వైరస్ నియంత్రణ కోసం అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. విమానాశ్రయాల్లో కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా జ్వరం, దగ్గు… ఇతర లక్షణాలు ఉన్నవారు దయచేసి అందరితో కలిసి భోజనాలు చేయవద్దు. పార్టీల్లో పాల్గొనవద్దు. దగ్గర్లోని ఆస్పత్రికి సాధ్యమైనంత త్వరగా వెళ్లండి. కరోనా వ్యాప్తి నియంత్రణకు స్వంత వైద్యం చేసుకోవద్దని తెలిపింది.మొత్తం మీద కరోనా కొత్త కేసులు చైనాలో వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని చెప్పాలి.
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..