నిర్మాణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎవర్గ్రాండ్. చైనాలో వేలాది ఇళ్లను నిర్మించింది. వేగంగా నిర్మాణాలు చేపట్టడంతో పాటు, అంతే వేగంగా నిర్మాణాలను పూర్తిచేయడంలోనూ ఎవర్గ్రాండ్ సంస్థ ముందు వరసలో ఉంటుంది. అలాంటి ఎవర్గ్రాండ్ సంస్థ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఎవర్ గ్రాండ్ 300 బిలియన్ డాలర్లమేర అప్పులు చెల్లించాల్సి ఉన్నది. ఈ అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్మేందుకు ఎవర్గ్రాండ్ సిద్దమైనప్పటికీ కుదరలేదు. Read: మీడియాపై రాజమౌళి పంచులు.. మీ సంగతి…
చైనా జెయింట్ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా కీలక నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే దేశీయ, అంతర్జాతీయ ఈ కామర్స్ వ్యాపారాలను పునర్వవస్థీకరిస్తామని చెప్పింది. ఈ ప్రకటనతో అలీబాబా షేర్లు భారీగా పడిపోయాయి. కరోనా సమయంలో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా చైనా బ్యాంకులకు, ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ తరువాత దాదాపు మూడు నెలల పాటు జాక్మా ఎవరికీ కనిపించలేదు. ఎమయ్యారో తెలియలేదు. ఆ తరువాత బయటకు వచ్చినా ఆయన పెద్దగా యాక్టీవ్గా కనిపించడం లేదు.…
పూలనే… కునుకేయమంటా… తను వచ్చేనంట… తను వచ్చేనంటా… ఈ పాట గుర్తుంది కదా. ఈ సాంగ్ను ఎక్కడ చిత్రీకరించారో తెలుసు కదా. చైనాలో. చైనాలో వేల ఎకరాల్లో పూలను పండిస్తున్నారు. ఇప్పుడు ఈ పూల వ్యాపారం చైనాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కరోనా తరువాత ఈ పూల వ్యాపారం మరింత పెరిగింది. ఆన్ లైన్ ద్వారా పూలు, బొకేలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో వ్యాపారం మరింతగా పెరిగింది. ఆసియాలో అతిపెద్ద…
చంద్రునిపై క్యూబ్ రూపంలో ఉన్న ఓ ఆబ్జెక్ట్ను చైనాకు చెందిన యూతు 2 మూన్ రోవర్ గుర్తించింది. దూరం నుంచి మూన్ రోవర్ తీసిన ఈ ఫొటోను ఇటీవలే చైనా అంతరిక్ష సంస్థ విడుదల చేసింది. బూదరబూదరగా ఉన్న ఆ ఫొటోపై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. క్యూబ్ ఆకారంలో ఉండటంతో అది ఖచ్చితంగా ఇల్లే అయి ఉంటుందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే, కాదు, అది స్తూపం అయి ఉండొచ్చని కొందరు, కొంతమంది అది ఎలియన్…
అమెరికా తరువాత ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశం చైనా. ఆసియాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అన్ని ఎత్తులు వేస్తున్నది. ఇక, అమెరికాను అన్ని విధాల అడ్డుకునేందుకు కూడా చైనా ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిని పసిగట్టిన అమెరికా కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. చైనా నుంచి అమెరికా స్టాక్ ఎక్చేంజ్లో లిస్టింగ్ అయిన కంపెనీలకు నిబంధనలు విధించారు. ఈ నిబంధనల ప్రకారం చైనా కంపెనీలు వారి ఆడిట్ రిపోర్టులలో కొంత…
ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలపై చైనా కన్నేసింది. చైనా బెల్ట్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఆయా దేశాలను రుణదేశాలుగా మారుస్తున్నది. ఆఫ్రికాలోని అనేక దేశాలను చైనా ఈ విధంగానే లోబరుచుకున్నది. చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు యూరోపియన్ దేశాల సమాఖ్య 300 బిలియన్ డాలర్లతో గ్లోబల్ గేట్వే ను ప్రకటించింది. ఇది చైనా మాదిరిగా చీకటి ఒప్పందాలు ఉండవని, దేశాలను అప్పులు ఊబిలోకి నెట్టడం జరగదని, చిన్న…
గతంలో అనేక అమెరికా సంస్థలు తమ కార్యాలయాలను చైనాలో నెలకొల్పాయి. అమెరికా తరువాత అతిపెద్ద మార్కెట్ చైనా కావడంతో ఆ దేశంలో తమ కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. ప్రస్తుతం చైనాలో ఆంక్షలు కఠినంగా ఉండటంతో పెద్ద పెద్ద సంస్థలు అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్కు చెందిన జాబ్ పోర్టల్ లింక్డిన్ ఇండియా మార్కెట్పై దృష్టి సారించింది. Read: డాక్టర్పై 20 ఏళ్ల యువతి కేసు… వైద్యుని నిర్లక్ష్యం వల్లనే… ఇండియాలో ఇప్పటి వరకు ఇంగ్లీష్ వెర్షన్…
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహించాల్సి ఉంది. వింటర్ ఒలింపిక్స్ కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నది చైనా. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఒమిక్రాన్ సవాళ్లను ఎదుర్కొని తప్పకుండా వింటర్ ఒలింపిక్స్ను నిర్వహిస్తామని చైనా చెబుతున్నది. Read: స్మార్ట్ఫోన్ ఎఫెక్ట్: గతం మర్చిపోయిన యువకుడు… మహమ్మారిని ఎదుర్కొనడంలో చైనాకు చాలా అనుభవం ఉందని, ఒమిక్రాన్ వేరియంట్…
ప్రపంచం మొత్తం ఇప్పుడు కొత్త వేరియంట్తో భయపడుతున్నది. ఎటు నుంచి దేశంలోకి ప్రవేశిస్తుందో తెలియక ఆందోళనలు చెందుతున్నారు. ఈ వేరియంట్ నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేదం విధిస్తే, ఇజ్రాయిల్ వంటి దేశాలు సరిహద్దులు మూసివేశాయి. ప్రపంచ దేశాలు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంటే, చైనా మాత్రం తనకేమి తెలియదు అన్నట్టుగా బలప్రదర్శన చేస్తున్నది. Read: బ్రేకింగ్ : ఒమిక్రాన్పై సబ్ కమిటీ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..…
సాధారణంగా ఉండాల్సిన ఎత్తుకంటే తక్కువ ఎత్తు ఉంటే పొట్టివాళ్లు అని అంటారు. కానీ, పొట్టివాళ్లకంటే ఇంకా తక్కువ ఎత్తు ఉంటే వారిని మరగుజ్జులు అంటారు. సాధారణంగా మరగుజ్జులు చాలా తక్కువ మంది ఉంటారు. జీన్స్ ప్రభావం కారణంగా ఇలా మరగుజ్జులుగా పుడుతుంటారు. అయితే, ఓ గ్రామంలో సగానికి సగం మంది జనాభా మరగుజ్జులే ఉన్నారట. ఆ గ్రామం ఎక్కడ ఉంది.. ఎందుకు అక్కడి ప్రజలు మరగుజ్జుగా ఉన్నారు తెలుసుకుందాం. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో యాంగ్సి అనే గ్రామం…