గతేడాది గాల్వన్ లోయలో చైనా సైనికులు పహారా కాస్తున్న భారత సైన్యంపై పదునైన ఆయుధాలతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా చైనీయులు దాడి చేయడంతో దానికి భారత్ కూడా తగిన విధంగా బదులు చెప్పింది. ఈ రగడ తరువాత రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. గాల్వన్ భూభాగం తమదే అంటూ చైనా పదేపదే చెబుతూ వస్తున్నది. భారత్ దానికి ధీటుగా జవాబు ఇస్తూనే ఉన్నది. ఇటీవలే చైనా ఆరుణాల్ ప్రదేశ్ లోని 15…
ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు భారీ నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. చైనాలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూగర్భ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈశాన్య చైనాలోని డాలియన్ సిటీలోని మార్కెట్ దిగువన ఉన్న అండర్ గ్రౌండ్లో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరగవచ్చని అంటున్నారు. గాయపడ్డ కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…
ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమీ 12 సీరిస్ను డిసెంబర్ 28 వ తేదీన రిలీజ్ చేసింది. ఈ ఫోన్ ను రిలీజ్ చేసిన 5 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1.8 బిలియన్ యునాన్ల స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జరిగాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2108 కోట్లు విలువైన షావోమీ 12 సీరిస్ మొబైల్ అమ్మకాలు జరిగాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. షావోమీ సంస్థ చైనాలో తొలిసారి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్…
చైనా మరోసారి కుటిలబుద్ధిని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్లోని అనేక ప్రాంతాలకు చైనా పేర్లను పెట్టింది. దీనిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే చైనా పేర్లను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించింది. అయితే, చైనా దానికి ససేమిరా అంటోంది. అరుణాచల్ ప్రదేశ్ టిబెట్లో భాగస్వామ్యమని, దక్షిణ టిబెట్గా తాము పిలుస్తామని, తమ భూభాగంలోని ప్రదేశాలకు పేర్లు పెట్టుకుంటామని, తన సార్వభౌమత్వానికి ఎవరూ అడ్డు వచ్చినా ఊరుకునేది లేదని చైనా స్పష్టం చేసింది. ఆరుణాచల్ ప్రదేశ్లోని 15 భూభాగాలకు చైనా పేర్లు…
ప్రపంచంలో సమర్థవంతమైన, అత్యంత శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసేందుకు అగ్రరాజ్యాలు సిద్దమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, రోబోటిక్ టెక్నాలజీని బేస్ చేసుకొని స్వీయ నియంత్రిత కిల్లర్ రోబోట్స్ను తయారు చేసేందుకు చైనా, అమెరికా, రష్యా దేశాలు సన్నాహాలు చేస్తున్నాయి. రోబోటిక్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక రంగాల్లోకి రోబోలు ప్రవేశించాయి. అయితే, ఇప్పటి వరకు ప్రొగ్రామ్ ఆపరేటింగ్ లేదా రిమోట్ కంట్రోల్ తో పనిచేసే రోబోలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు స్వీయ నియంత్రిత రోబోలను అందుబాటులోకి రాబోతున్నాయి.…
ప్రపంచం మొత్తం ఒమిక్రాన్, కరోనా మహమ్మారులతో అనేక ఇబ్బందులు పడుతున్నాయి. యూరప్, అమెరికా దేశాల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండటంతో యూరప్ దేశాల్లో ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ కు పుట్టినల్లైన చైనాలో కేసులు చాలా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. అయినప్పటికీ అనేక నగరాల్లో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు, వూహన్ తరహా లాక్డౌన్ను అమలు చేస్తున్నది. చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన జియాంగ్ నగరంలో కఠినమైన లాక్డౌన్ను అమలు చేస్తున్నారు.…
ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి స్టార్ లింక్స్ ను రోదసిలోకి ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ను వేగవంతం చేసేందుకు ఈ స్టార్ లింక్స్ తోడ్పడతాయి. సుమారు 42 వేల స్టార్ లింక్స్ను రోదసిలోకి ప్రవేశపెట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 1800 లకు పైగా స్టార్ లింక్ లను ప్రవేశపెట్టారు. ఈ స్టార్ లింక్ ల కారణంగా చైనా అంతరిక్ష కేంద్రం టియాన్జేకు ముప్పు ఏర్పడినట్టు ఆ దేశ అంతరిక్ష సంస్థ తెలియజేసింది. 2001 జులై…
ప్రపంచంలో అతిపెద్ద కార్ల సంస్థగా ప్రసిద్ధి చెందిన టెస్లా కంపెనీకి చైనా దిగ్గజం హువావే షాక్ ఇచ్చింది. హువావే ఐటో ఎం 5 అనే కారును రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నది. హైబ్రీడ్ కారు కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎలక్ట్రిక్తోనూ, పెట్రోల్ తోనూ నడుస్తుంది. ఒకసారీ ఈ కారు బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు. అంతేకాదు, హైబ్రీడ్ కారు కావడంతో స్టీరింగ్ జీరో అయినప్పటికీ ప్రయాణం చేయగలదు. టెస్లా…
కరోనా వైరస్కు పుట్టినిల్లు చైనా. చైనాలోని వూహాన్ నగరంలో ఈ వైరస్ పుట్టింది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకిందిని చెబుతున్నా, ల్యాబ్ నుంచే లీక్ అయిందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వైరస్తో గత రెండేళ్లుగా ప్రపంచదేశాలు పోరాటం చేస్తున్నాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చినా వైరస్ లొంగడం లేదు. రూపం మార్చుకొని కొత్తగా విజృంభిస్తోంది. ప్రపంచం యావత్తు ఈ వైరస్ దెబ్బకు ఆర్ధికంగా కుదేలైపోయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒమిక్రాన్ వేరియంట్తో ఇబ్బందులు పడుతుంటే, చైనాలో…
విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగష్ట్ 4న అష్టవక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు…