ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. గత మూడు రోజులుగా టీడీపీ నేతలు, వైసీపీ నేతలు మాటలతో యుద్ధ చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు కౌంటర్ ఇచ్చారు. పదవి దిగాక గౌతమ్ సవాంగ్ పరిస్థితేంటో ఆలోచించుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సీఎం జగన్ ఏదో అంటే బీపీ వచ్చి పార్టీ కార్యాలయంపై దాడి చేశారంట.. గతంలో చంద్రబాబును దుర్భాషలాడితే మాకూ బీపీ రాలేదనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ‘తాడేపల్లి కొంపను కూల్చాలని…
టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు.. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజకీయాలు వదిలేస్తారా..? అని ప్రశ్నించారు అవంతి శ్రీనివాస్.. రాష్ట్రంలో 80 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయో? లేదో..? మీ ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుందంటూ చంద్రబాబుకు హితవుపలికిన ఏపీ మంత్రి… హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆగ్రహం…
తెలుగుదేశం పార్టీపై మరోసారి హాట్ కామెంట్లు చేశారు వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ వెంటిలేటర్ మీద వున్న పార్టీ అంటూ సెటైర్లు వేసిన ఆయన.. అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.. అందుకే బూతులు మాట్లాడిస్తూ.. కుంటసాకులతో దీక్షలు చేస్తూ.. రాజకీయలబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక, టీడీపీ హయాంలో ప్రజా కంఠక పాలన సాగిందన్నారు సాయిరెడ్డి.. వైసీపీ పాలనలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డ ఆయన.. అందుకే ప్రభుత్వం…
ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది.. మాటల యుద్ధమే కాదు.. చివరకు దాడులకు వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, ఇప్పుడు ఓవైపు టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తుంటే.. మరోవైపు టీడీపీ వ్యవహారశైలికి వ్యతిరేకంగా కౌంటర్ దీక్షలు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడంలేదు.. శనివారం రోజు ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కేంద్ర హోంశాఖ దృష్టికి దాడుల విషయాన్ని తీసుకెళ్లిన…
టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ఇవాళ ముగియనుంది.. గురువారం ఉదయం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో దీక్షకు దిగారు చంద్రబాబు.. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల దాడులను నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు.. ఆ దీక్షకు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ అంటూ పేరు పెట్టారు.. గురువారం ఉదయం నుంచి చంద్రబాబు 36 గంటల దీక్ష…
ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష.. దీనికి ప్రతిగా వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే రాష్ట్ర బంద్ చేస్తారా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో ట్వీట్లు చేశారు. జగన్ గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దని, ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉనికిని…
చంద్రబాబు దీక్షకు కౌంటర్గా ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేత జనాగ్రహ దీక్షలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు ప్రజాగ్రహ దీక్షలో పాల్గొన్న మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. చంద్రబాబునాయుడుపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అండతో పట్టాభి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే దాడి జరిగిందన్నారు. పట్టాభి కి మద్దతుగా చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటు అన్నారు. మా సంక్షేమ…
సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసనగా ర్యాలీలు జరుగుతున్నాయి. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎమ్మెల్యే గణేష్ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు, పట్టాభి, అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు. అబీద్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే గణేష్ మాట్లాడారు. టీడీపీ నాయకుడు…
టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించిన ఆయన.. మేం కూడా ఢిల్లీకి వెళ్తాం.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం అన్నారు.. ఇక, బూతులు మాట్లాడే హక్కు కోసం టీడీపీ ధర్నాలు చేస్తుందని మండిపడ్డారు సజ్జల.. దాడి చేయటం తప్పే.. కానీ, ఆ ఆగ్రహానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు.. మిగిలిన పార్టీలు…
టీడీపీ నేతలు సవాల్ చేస్తుంటే.. వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఏపీ వేదికగా టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరి ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. వీరి ఛాలెంజ్ లతో ఏపీ రణరంగంగా మారింది. వైపీసీ నేతలేమో పట్టాభితో పాటు చంద్రబాబును కూడా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూంటే.. టీడీపీ నేతలేమో గుడిలాంటి మా కార్యాలయంపై దాడికి దిగడం సిగ్గుచేటని, దమ్ముంటే ఇప్పుడు రావాలంటూ సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత…